విషాదం.. ఆర్మీ ఛాపర్​ క్రాష్​.. ఇద్దరు పైలట్లు మృతి

author img

By

Published : Mar 16, 2023, 2:17 PM IST

Updated : Mar 16, 2023, 10:46 PM IST

Indian Army Cheetah helicopter

ఇండియన్​ ఆర్మీ హెలికాప్టర్​ కుప్పకూలింది. అరుణాచల్ ప్రదేశ్​లో గురువారం ఉదయం జరిగిందీ ప్రమాదం. ప్రస్తుతం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్​లో ఉన్న ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. అరుణాల్ ప్రదేశ్​లోని మండలా పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. హెలికాప్టర్ క్రాష్ గురించి తెలిసిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. కుప్పకూలిన ఛాపర్​లోని పైలట్లు ఇద్దరూ మరణించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. మరణించిన పైలట్లను లెఫ్ట్​నెంట్​ కల్నల్​ వీవీబీ రెడ్డి, మేజర్​ ఎ. జయంత్​గా గుర్తించారు. అయితే లెఫ్టెనెంట్​ కల్నల్ వీవీబీ రెడ్డి.. తెలంగాణలోని యాదాద్రి జిల్లాకు చెందినవారుగా తెలిసింది. ఆయన భార్య కూడా ఆర్మీలోనే దంత వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్ననట్లు సమచారం. కాగా, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టనున్నామని చెప్పారు. మండలా పర్వత ప్రాంతంలో తూర్పు బంగ్లాజాప్ గ్రామ సమీపంలో విమాన శకలాలు లభించినట్లు వెల్లడించారు.

అధికారుల సమాచారం ప్రకారం.. గురువారం ఉదయం 9.15కు భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ బోమ్డిలా ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్​తో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన హెలికాప్టర్​లో ఓ సీనియర్​ ఆఫీసర్​ సహా ఇతర సిబ్బంది, పైలట్​ ఉన్నాడని అధికారులు తెలిపారు. దిరంగ్ నుంచి 100 కి.మీ దూరంలో మండలా వైపుగా పొగను చూసినట్లు స్థానికులు తెలిపారు.

Indian Army Cheetah helicopter
హెలికాప్టర్​ శకలాలు
Indian Army Cheetah helicopter
హెలికాప్టర్​ శకలాలు

అసోంలోని మిస్సమరి ప్రాంతం నుంచి అరుణాచల్​ ప్రదేశ్​లోని సెంగే గ్రామానికి వెళుతున్న హెలికాప్టర్​కు.. మార్గమధ్యలో ఉండగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్​తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాతంలో బంగ్​జాలేప్ గ్రామస్థులు.. హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైనట్లు దిరంగ్ పోలీసులకు సమాచారం అందించారని వారు వెల్లడించారు. ఈ రోజు వాతావరణం చాలా పొగమంచుగా ఉందని అధికారులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సిగ్నల్​ లేని కారణంగా ప్రమాదానికి సంబంధించి ఇంత వరకు ఎటువంటి ఫొటోలు లభించలేదు.

కొన్ని నెలల క్రితం ఇదే రాష్ట్రంలో కూలిన చీతా హెలికాప్టర్..
2022 అక్టోబర్​లోను ఇదే రాష్ట్రంలో భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. తవాంగ్ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు.

2022 మార్చిలో కూలిన చీతా హెలికాప్టర్​..
జమ్ముకశ్మీర్​లోని గురేజ్​ సెక్టార్​లోని బారౌమ్​ ప్రాంతంలో సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్​ కూలింది. ఈ ఘటనలో కో-పైలట్​ ప్రాణాలు కోల్పోగా.. పైలట్​ గాయాలతో బయటపడ్డారు. ఘటనలో మేజర్ సంకల్ప్​ యాదవ్​ (29) తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 2015 నుంచి సంకల్ప్​ యాదవ్​ సైన్యానికి సేవలు అందిస్తున్నారు. సమీపాన ఉన్న ఓ స్థావరం వద్ద అనారోగ్యంతో బాధపడుతున్న సైనికుడిని తరలించేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. గుజ్రాన్​ ప్రాంతం వద్దకు హెలికాప్టర్​ చేరుకున్న తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్​తో సంబంధాలు తెగిపోయాయి. హిమపాతం తీవ్రంగా ఉన్న బందిపోరాలోని గుజ్రన్​ నల్లాహ్​ ప్రాంతంలో హెలికాప్టర్​ శకలాలు కనిపించాయి.

జనవరిలో కూలిన ట్రైనింగ్​ ప్లేన్..
2023 జనవరి నెల ప్రారంభంలో ఓ ట్రైనింగ్​ ప్లేన్ కూలిపోయింది. రీవా నగరంలోని ఎయిర్​స్ట్రిప్​పై ఈ ప్లేన్​ కూలింది. ఈ ప్రమాదంలో పట్నాకు చెందిన కెప్టెన్​ విమల్​ కుమార్​(50) ప్రాణాలు కోల్పోగా.. జైపుర్​కు చెందిన సోను యాదవ్​(23) తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. పైలట్​కు తీవ్ర గాయాలు కావడం వల్ల పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతిచెందాడు. చోర్​హటా పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఉమ్రీ గ్రామంలో ఓ ఆలయ గోపురానికి ప్లేన్​ ఢీకొట్టడం వల్లే.. ఈ ప్రమాదం జరిగింది.

Last Updated :Mar 16, 2023, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.