ETV Bharat / bharat

కూలిన మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌.. ఇద్దరు పైలట్లు మృతి

author img

By

Published : Jul 28, 2022, 10:47 PM IST

Updated : Jul 29, 2022, 4:19 AM IST

fighter plane crash in Barmer
fighter plane crash in Barmer

భారత్​-పాకిస్థాన్​ సరిహద్దులో వాయుసేనకు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. రాజస్థాన్​ బాడ్​మేర్​ జిల్లాలోని భిమ్​డా గ్రామంలో యుద్ధ విమానం మిగ్-21 కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు.

భారత్​-పాక్​ సరిహద్దులో కుప్పకూలిన యుద్ధ విమానం.. కిలోమీటర్​ పరిధిలో శకలాలు

భారత వాయుసేనకు చెందిన శిక్షణ యుద్ధవిమానం మిగ్‌-21 రాజస్థాన్‌లోని బాడ్​మేర్ జిల్లాలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. బిమ్రా సమీపంలో గురువారం రాత్రి 9.10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ధ్రువీకరించింది. విమానం కూలిన సమయంలో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. దీనికి సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రమాదంపై భారత వాయుసేన అధిపతి మార్షల్‌ వీఆర్‌ చౌదరితో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పైలట్ల మృతి పట్ల రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి సేవను దేశం ఎప్పుడూ మరిచిపోదన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

మిగ్‌-21 ప్రమాదం జరిగి పైలట్లు మృతిచెందడంపై భారత వాయుసేన తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీని ఆదేశించినట్లు తెలిపింది.

ఇవీ చదవండి: శిక్ష పూర్తైనా జైలులోనే ఖైదీ.. నాలుగేళ్లు నరకం.. చివరకు...

చెన్నై 'చెస్ ఒలింపియాడ్' నుంచి పాక్ ఔట్.. 'అంతా రాజకీయం!'

Last Updated :Jul 29, 2022, 4:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.