ETV Bharat / bharat

వరుసగా రెండో రోజూ 4 లక్షలకుపైగా కేసులు

author img

By

Published : May 7, 2021, 9:30 AM IST

దేశంలో కరోనా విలయం భీకర స్థాయిలో కొనసాగుతోంది. మరోసారి నాలుగు లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 3,915 మంది మరణించారు.

india covid cases
భారత్ కరోనా

భారత్​లో రోజువారీ కరోనా కేసులు మరోసారి నాలుగు లక్షలకు పైగా నమోదయ్యాయి. కొత్తగా 4,14,188 మందికి వైరస్ పాజిటివ్​గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. మరో 3,915 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 2,14,91,598‬
  • మరణాలు: 2,34,083
  • కోలుకున్నవారు: 1,76,12,351
  • యాక్టివ్ కేసులు: 36,45,164

మే 6న 18,26,490 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 29,86,01,699కు చేరినట్లు తెలిపింది.

ఇదీ చదవండి: బోరుబావిలో పడిన బాలుడి కథ సుఖాంతం​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.