Corona Update: నాలుగో రోజూ 40వేలకుపైగా కేసులు

author img

By

Published : Aug 29, 2021, 9:50 AM IST

INDIA CORONA CASES
భారత్​లో కరోనా కేసులు ()

భారత్​లో కరోనా (Corona Update) మళ్లీ విజృంభిస్తోంది. శనివారం ఒక్కరోజే మరో 45 వేలమందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. 460 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో కేసులు(Coronavirus) ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నాయి.

భారత్​లో కొవిడ్​ కేసులు (Corona virus India) వరుసగా నాలుగో రోజూ 40 వేలకుపైగా నమోదయ్యాయి. కొత్తగా 45,083 మంది వైరస్​(Covid-19) బారినపడ్డారు. మరో 460 మంది మరణించారు. 35,840 మంది కరోనా​ను జయించారు.

ప్రస్తుతం రికవరీ రేటు 97.53 శాతంగా ఉంది.

  • మొత్తం కేసులు: 3,26,95,030
  • మొత్తం మరణాలు: 437830
  • మొత్తం కోలుకున్నవారు: 3,18,88, 642
  • యాక్టివ్ కేసులు: 3,68,558

తగ్గిన టెస్టులు..

శనివారం ఒక్కరోజే 17 లక్షల 55 వేలకుపైగా పరీక్షలు జరిపినట్లు ఐసీఎంఆర్​ వెల్లడించింది. మొత్తం టెస్టుల సంఖ్య 51 కోట్ల 86 లక్షలు దాటింది.

కరోనా వ్యాక్సినేషన్​లో (COVID vaccination) భారత్ దూసుకెళ్తోంది. శనివారం 73 లక్షలకుపైగా టీకా డోసుల్ని లబ్ధిదారులకు అందించారు అధికారులు. మొత్తంగా ఇప్పటివరకు 63 కోట్ల 9 లక్షల 17 వేల 927 టీకా డోసులను పంపిణీ చేసింది కేంద్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కేరళలో లాక్​డౌన్​..

కేరళలో కరోనా విజృంభిస్తోంది. శనివారం దేశవ్యాప్తంగా నమోదైన 45,083 కేసుల్లో 31,265 కేరళ నుంచే కావడం గమనార్హం. వైరస్ ఉద్ధృతి దృష్ట్యా ఆదివారం సంపూర్ణ లాక్​డౌన్​ అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. లాక్​డౌన్​ కారణంగా తిరువనంతపురం సహా పలు ప్రధాన నగరాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.

KERALA LOCKDOWN
లాక్​డౌన్​తో నిర్మానుష్యంగా రోడ్లు
KERALA LOCKDOWN
కేరళలో లాక్​డౌన్​.. తిరువనంతపురంలో ఖాళీగా రోడ్లు
  • సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి పినరయి విజయన్. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు.
  • లక్షకు పైగా యాక్టివ్ కేసులున్న రాష్ట్రం కేరళ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరో నాలుగు రాష్ట్రాల్లో 10 వేల నుంచి లక్ష మధ్యలో క్రియాశీల కేసులున్నట్లు వెల్లడించింది.
  • జులైలో రెండు పండగల కోసం ఆంక్షలను సడలించిన నాటి నుంచి కేరళలో మరోసారి వైరస్​ విజృంభిస్తోంది.

ప్రపంచ దేశాల్లో కేసులు ఇలా..

కరోనా పలు దేశాలపై మళ్లీ విరుచుకుపడుతోంది.

  • ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులో 5 లక్షల 43 వేల కేసులు, 8 వేలకుపైగా మరణాలు సంభవించాయి.
  • అమెరికాలో శనివారం 72 వేల కేసులు నమోదయ్యాయి. మరో 600 మందికిపైగా చనిపోయారు.
  • బ్రెజిల్​, రష్యా, మెక్సికో, ఇరాన్​లోనూ కేసులు తీవ్ర స్థాయిలో వెలుగుచూస్తున్నాయి.

ఇవీ చూడండి: 'పండగల వేళ జాగ్రత్త- కరోనాపై అలసత్వం వద్దు'

Afghanistan Crisis: 'అఫ్గాన్​ తాజా పరిస్థితులకు అమెరికానే కారణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.