ETV Bharat / bharat

Corona Cases: దేశంలో కొత్తగా 35వేల కేసులు, 37వేల రికవరీలు

author img

By

Published : Aug 18, 2021, 9:46 AM IST

Updated : Aug 18, 2021, 10:23 AM IST

దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 35,178 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 440 మంది మరణించారు.

India cases
కరోనా కేసులు

భారత్​లో రోజువారీ కొవిడ్​ కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా 35,178 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 440 మంది మరణించారు. కొత్తగా 37,169 మంది కరోనా​ను జయించారు.

  • మొత్తం కేసులు: 3,22,85,857
  • మొత్తం మరణాలు: 4,32,519
  • కోలుకున్నవారు: 3,14,85,923
  • యాక్టివ్​ కేసులు: 3,67,415

కొవిడ్​ పరీక్షలు

మంగళవారం ఒక్కరోజే దేశంలో 17,97,559​ కొవిడ్​ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 49,84,27,083కు చేరింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వ్యాక్సినేషన్​..

దేశంలో ఇప్పటివరకు 56,06,52,030 వ్యాక్సిన్ డోసులు అందించారు. మంగళవారం ఒక్కరోజే 55,05,075 డోసులు పంపిణీ చేశారు.

ప్రపంచంలో కొవిడ్​ కేసులు..

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 6,46,112 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 9,920 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 20,93,40,315కి చేరగా.. మరణాల సంఖ్య 43,93,492కు పెరిగింది.

కొత్త కేసులు..

  • అమెరికా- 1,37,307
  • బ్రెజిల్-​ 38,218
  • ఫ్రాన్స్-​ 28,114
  • బ్రిటన్​- 26,852
  • రష్యా- 20,958

ఇదీ చదవండి: కేరళలో కొవిడ్​ ఉద్ధృతి- కొత్తగా 21 వేల కేసులు

Last Updated : Aug 18, 2021, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.