ETV Bharat / bharat

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు- ఒక్కరోజే 71,365 మందికి వైరస్​

author img

By

Published : Feb 9, 2022, 9:37 AM IST

India Covid cases
India Covid cases

India Covid cases: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 71,365 మందికి వైరస్​ సోకింది. కొవిడ్​ ధాటికి మరో 1,217 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్ష మందికిపైగా మహమ్మారి నుంచి కోలుకున్నారు.

India Covid cases: భారత్​లో రోజువారి కరోనా కేసుల్లో స్వల్పంగా పెరుగుదల నమోదైంది. కొత్తగా 71,365 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ​ నిర్ధరణ అయింది. ఒక్కరోజులోనే 1,217 మంది మృతి చెందారు. దేశంలో పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 1,72,211మంది వైరస్​ను జయించారు.

యాక్టివ్​ కేసులు ప్రస్తుతం 2.62 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 96.19 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,24,10,976
  • మొత్తం మరణాలు: 5,05,279
  • యాక్టివ్ కేసులు: 8,92,828
  • మొత్తం కోలుకున్నవారు: 4,10,12,869‬

దేశంలో కొత్తగా 53,61,099 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,70,87,06,705 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

World Corona cases

ప్రపంచవ్యాప్తంగానూ కొవిడ్​ కేసుల్లో పెరుగుదల కనిపించింది. కొత్తగా 21 లక్షల మంది కరోనా బారినపడ్డారు. 11,785 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 57,81,546కు చేరింది.

  • జర్మనీలో కొత్తగా 2,12,724 లక్షల మందికి వైరస్ బారినపడ్డారు. మరో 231 మంది ప్రాణాలు కోల్పాయారు.
  • అమెరికాలో ఒక్కరోజే 1,79,169 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. మరో 2,777 మంది మృతి చెందారు.
  • రష్యాలో కొత్తగా 1.65 లక్షల మందికి కరోనా సోకింది. 698 మంది మృతి చెందారు.
  • టర్కీలో తాజాగా 11,1096 కేసులు బయటపడగా.. 241 మంది బలయ్యారు.
  • బ్రెజిల్​లో ఒక్కరోజే 1,71,483 మందికి వైరస్ సోకింది. మరో 1,174 మంది మృతి చెందారు.

ఇదీ చూడండి: కొండ చీలికలో చిక్కిన యువకుడు.. రెండు రోజులుగా అన్నపానీయాలు లేక..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.