ETV Bharat / bharat

kabul airport blast: కాబుల్​ ఆత్మాహుతి దాడులను ఖండించిన భారత్​

author img

By

Published : Aug 27, 2021, 6:37 AM IST

కాబుల్‌ పేలుళ్ల(kabul airport blast) ఘటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. మృతుల కుటుంబాలకు కేంద్ర విదేశాంగశాఖ సంతాపం తెలిపింది. ఉగ్రదాడులకు(Terror Attacks) వ్యతిరేకంగా ప్రపంచం ఏకతాటిపై నిలవాలని సూచించింది.

India
భారత్

కాబుల్ విమానాశ్రయంలో జరిగిన పేలుళ్ల(kabul airport blast) ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచం ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని కాబుల్‌ ఘటన సూచిస్తోందని తెలిపింది. మృతుల కుటుంబాలకు కేంద్ర విదేశాంగ శాఖ సంతాపం తెలిపింది. ఉగ్రదాడులకు(Terror Attacks) వ్యతిరేకంగా ప్రపంచం ఏకతాటిపై నిలవాలని సూచించింది.

"ఈ పేలుళ్లు.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం ఏకతాటిపైకి రావాలని సూచిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న వారికి వ్యతిరేకంగా ప్రపంచం పోరాడాలి. "

- భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ

కాబుల్ విమానాశ్రయం వెలుపల బాంబు పేలుళ్ల ఘటనలో 72 మంది దుర్మరణం చెందారు. మరో 143 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 12మంది అమెరికా రక్షణ సిబ్బంది కూడా ఉన్నారు. ఇవి ఆత్మాహుతి దాడులేనని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది.

ఇదీ చదవండి: వారి వద్ద అణుబాంబులకు వాడే ముడి సరకు- విలువ వేల కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.