ETV Bharat / bharat

బలగాల ఉపసంహరణపై త్వరలోనే మళ్లీ సైనిక చర్చలు

author img

By

Published : Dec 25, 2020, 5:30 AM IST

తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ) వెంబడి బలగాల ఉపసంహరణపై మరోసారి భారత్​-చైనా సైనిక చర్చలు జరపనున్నాయి. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దౌత్య, సైనిక స్థాయి చర్చలతోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడింది.

సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ ప్రక్రియ వేగవంతం చేసేందుకు కృషి చేయాలని భారత్​, చైనా నిర్ణయించాయి. ఈ మేరకు మరోసారి సైనిక స్థాయి చర్చలు త్వరలోనే నిర్వహించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ వెల్లడించారు.

ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్స్​కు అనుగుణంగా ప్రక్రియ కొనసాగుతుందని.. దౌత్య, సైనిక స్థాయి చర్చలతోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

డిసెంబర్​ 18న భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలపై 'వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్' (డబ్ల్యూఎంసీసీ) పద్ధతిలో ఇరు దేశాల మధ్య వర్చువల్​గా చర్చలు జరిగాయి. ఆ భేటీలోనే తొమ్మిదో దఫా సైనిక చర్చలు జరపాలని నిర్ణయించినట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు.

భారీగా బలగాల మోహరింపు..

భారత్​-చైనా మధ్య ఎల్​ఏసీ వెంబడి 7 నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. తూర్పు లద్దాఖ్​లోని కీలక ప్రాంతాల్లో శీతాకాలంలోనూ యుద్ధ సన్నద్ధతను ముమ్మరం చేసింది భారత్​. ఇందుకోసం 50 వేల వరకు బలగాలను మోహరించింది. అలాగే.. ఎల్​ఏసీకి అవతలివైపు చైనా కూడా అదే స్థాయిలో సైన్యాన్ని మోహరించినట్లు అధికారులు తెలిపారు.

చివరిసారిగా నవంబర్​ 6న ఎనిమిదో దఫా సైనిక చర్చలు జరిగాయి. నిర్దిష్ట ఘర్షణ​ పాయింట్ల వద్ద నుంచి బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా చర్చించాయి.

ఇదీ చూడండి: 'చైనాతో వివాదం ఎప్పుడు ముగుస్తుందో ఊహించలేం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.