ETV Bharat / bharat

'సవాళ్లను ఎదుర్కొంటూ.. ప్రజలను తరలిస్తూ'

author img

By

Published : Aug 29, 2021, 5:05 AM IST

Updated : Aug 29, 2021, 6:20 AM IST

ప్రపంచంలో ఎక్కడైనా భారతీయుడు కష్టాల్లో ఉంటే.. దేశం తన పూర్తిశక్తిని ఉపయోగించి అతనికి అండగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. అది కరోనా సమయంలో(Corona crisis) కావచ్చు లేదా ప్రస్తుత అఫ్గానిస్తాన్ సంక్షోభంలో(Afghanistan Crisis) కావొచ్చని తెలిపారు. ఆపరేషన్ దేవిశక్తి కింద అఫ్గానిస్తాన్ నుంచి వందలాది మందిని భారత్‌కు తీసుకువస్తున్నామన్నారు.

PM
ప్రధాని నరేంద్ర మోదీ

అనేక సవాళ్ల మధ్య కల్లోలిత అఫ్గానిస్థాన్ నుంచి భారత్​.. తన ప్రజలను సురక్షితంగా తరలిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తెలిపారు. ప్రపంచంలో ఎక్కడైనా భారత పౌరుడు కష్టాల్లో ఉంటే.. దేశం వారివెంట ఉంటుందని స్పష్టం చేశారు. అమృత్​సర్​లో పునర్నిర్మించిన జలియన్​వాలాబాగ్ స్మారక సముదాయాన్ని శనివారం ఆయన వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేశారు. కేవలం ప్రజలనే కాకుండా.. పవిత్రమైన గురుగ్రంథ్ సాహిబ్ గ్రంథాలను కూడా భారత్​ తీసుకురాగలిగిందన్నారు.

" ప్రపంచ నలుమూలల్లో ఏ భారతీయుడు ఇబ్బందుల్లో ఉన్నా.. భారత్ వారికి అండగా ఉంటుంది. వారికి సాయం చేస్తుంది. అది కరోనా సమయమైనా, అఫ్గాన్ సంక్షోభం అయినా కావొచ్చు. ఈ విషయం ప్రపంచానికి తెలుసు. ఆపరేషన్ దేవీశక్తి పేరుతో వందల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చాం.

-- ప్రధాని మోదీ

జలియన్​వాలాబాగ్​లో 1919 ఏప్రిల్ 13న బ్రిటిష్ దుశ్చర్యకు బలైన అమరులకు నివాళులు అర్పించారు మోదీ. స్వాతంత్య్రం కోసం మన పూర్వికులు చేసిన త్యాగాలను, పోరాటాలను గుర్తుచేస్తూ రాబోయే తరాలకు కూడా ఈ ప్రాంతం స్ఫూర్తిని రగిలిస్తుందని అన్నారు.

ఇదీ చదవండి: తాలిబన్​ ఎఫెక్ట్​.. హడావుడిగా 70వేల గన్స్ కొంటున్న భారత్​

Last Updated : Aug 29, 2021, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.