ETV Bharat / bharat

Income Tax Raid: 50 చోట్ల ఐటీ సోదాలు- రూ.500 కోట్ల నల్లధనం గుర్తింపు!

author img

By

Published : Dec 1, 2021, 5:11 PM IST

Income Tax Raid Jaipur: రాజస్థాన్​ జైపుర్​లోని ఓ ప్రముఖ జ్యువెలరీ సంస్థ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో ఐటీ శాఖ రూ.500 కోట్ల నల్లధనాన్ని గుర్తించింది. క్యాష్​ లోన్స్​ సహా పలు క్రయవిక్రయాలకు సంబంధించి కూడా సంస్థ అవకతవకలకు పాల్పడిందని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించినట్లు అధికారులు తెలిపారు.

Income Tax Raid Jaipur
జ్యూలరీ సంస్థ నుంచి రూ.500 కోట్ల నల్లధనం పట్టివేత

Income Tax Raid Jaipur: రాజస్థాన్​లోని జైపుర్​కు చెందిన ఓ జ్యువెలరీ సంస్థ కార్యాలయాలపై చేపట్టిన దాడుల్లో ఆదాయపు పన్ను శాఖ రూ.500 కోట్ల నల్లధనాన్ని గుర్తించినట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. జైపుర్​లో సంబంధిత సంస్థకు చెందిన దాదాపు 50 కేంద్రాల్లో నవంబరు 23న సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 4 కోట్ల నగదు, రూ. 9 కోట్లు విలువ చేసే ఆభరణాలను అధికారులు జప్తు చేశారు.

ఇప్పటివరకు సంస్థ నుంచి రూ. 500 కోట్ల లెక్క చూపని ఆదాయాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వీటిలో రూ. 72 కోట్లు నల్లధనమని సంస్థ అంగీకరించినట్లు పేర్కొన్నారు. క్యాష్​ లోన్స్​ సహా పలు క్రయవిక్రయాలకు సంబంధించి సంస్థ అవకతవకలకు పాల్పడిందని.. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించినట్లు తెలిపారు.

ఆభరణాలు, వజ్రాల తయారీ- ఎగుమతులే లక్ష్యంగా ఈ సంస్థ వ్యాపారం సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆఫ్రికా దేశాల నుంచి ముడి సరకును దిగుమతి చేసుకుని జైపుర్​లో తయారు చేస్తున్నారని తెలిపారు. లెక్క చూపని ఆదాయంలో కొంత భాగం వజ్రాల తయారీలో మిగిలిన పదార్థాల విక్రయం ద్వారా వచ్చినదని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి : ఈ చిన్నారి జ్ఞాపక శక్తి చూస్తే 'వావ్'​ అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.