ETV Bharat / bharat

మోదీతో ఐఎంఎఫ్ ఆర్థికవేత్త ​గీతా గోపీనాథ్ భేటీ

author img

By

Published : Dec 16, 2021, 4:43 AM IST

Gita Gopinath meets PM modi: అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్​ డైరెక్టర్​గా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న ఇండో-అమెరికన్ గీతా గోపీనాథ్​.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

Gita Gopinath meets PM modi
ప్రధాని మోదీతో ​గీతా గోపీనాథ్

Gita Gopinath meets PM modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్​) ముఖ్య ఆర్థికవేత్త​, ఇండో-అమెరికన్ గీతా గోపీనాథ్.. దిల్లీలో బుధవారం​ సమావేశమయ్యారు. పలు కీలక విషయాలపై వారిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ఐఎంఎఫ్ మొదటి డిప్యూటీ మేనేజింగ్​ డైరెక్టర్​గా ఇటీవల పదోన్నతి పొందిన తర్వాత.. మోదీతో గీతా గోపీనాథ్​ భేటీ కావడం గమనార్హం. ఈ సమావేశం గురించి ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇరువురి ఫొటోలను షేర్ చేసింది.

Imf gita gopinath: ప్రస్తుతం ఐఎంఎఫ్​ ముఖ్య ఆర్థికవేత్తగా ఉన్న గీతా గోపీనాథ్​కు.. డిప్యూటీ మేనేజింగ్​ డైరక్టర్​గా పదోన్నతి కల్పిస్తున్నట్లు ఐఎంఎఫ్ ప్రకటించింది. ఐఎంఎఫ్​లో మొత్తం నలుగురు డిప్యూటీ మేనేజింగ్​ డైరక్టర్​లు ఉంటారు. జెఫ్రె ఓకమోటో.. వచ్చే ఏడాది తొలినాళ్లల్లో ఐఎంఎఫ్​ నుంచి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో గీతా గోపీనాథ్​ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Gita Gopinath meets PM modi
ప్రధాని మోదీతో ​గీతా గోపీనాథ్

గీతా గోపీనాథ్‌ గురించి ఆసక్తికర విషయాలు..

  • 1971లో కోల్‌కతాలో జన్మించారు. మైసూర్‌లోని నిర్మలా కాన్వెంట్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు.
  • దిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌ ఫర్‌ విమెన్‌లో బి.ఎ పూర్తి చేశారు. 1992లో దిల్లీ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ ఎకనామిక్స్‌ అభ్యసించారు.
  • వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలో మరోసారి ఎం.ఎ ఎకనామిక్స్‌లో చదివే అవకాశం రావడంతో తన ఐఏఎస్‌ ప్రణాళికలను పక్కన పెట్టేశారు. అనంతరం ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో ఉపకారవేతనంతో పీహెచ్‌డీ పూర్తి చేశారు. తర్వాత షికాగో విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు.
  • అక్కడి నుంచి 2010లో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో పూర్తిస్థాయి ప్రొఫెసర్‌గా చేరారు. అక్కడ ఉండగానే 2018లో ఐఎంఎఫ్‌లో పనిచేసే అవకాశం తలుపు తట్టింది.
  • గీతా గోపీనాథ్‌కు ఫ్యాషన్‌ రంగంలోనూ అనుభవం ఉంది. దిల్లీ వర్సిటీలో ఆమె తన భర్త ఇక్భాల్‌ సింగ్‌ను కలిశారు. ప్రస్తుతం వీరికి 18 ఏళ్ల రాహిల్‌ అనే అబ్బాయి ఉన్నాడు.

ఇదీ చూడండి: ప్రపంచంలో అత్యంత ఆరాధించే వ్యక్తుల్లో మోదీకి 8వ స్థానం

ఇదీ చూడండి: 'సెమీకండక్టర్స్​పై కేబినెట్​ నిర్ణయం.. ఆవిష్కరణలకు ఊతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.