ప్రయాణికుడి ముఖంపై వేడి నీళ్లు.. విమానం​ ఎమర్జెన్సీ ల్యాండింగ్

author img

By

Published : Apr 21, 2022, 8:04 AM IST

Flight Makes Emergency Landing

Flight Makes Emergency Landing: రాజస్థాన్​ నుంచి హైదరాబాద్​కు టేకాఫ్​ అయిన విమానం కొద్ది సేపటికే ఎమర్జెన్సీ ల్యాండింగ్​ అయ్యింది. ఆ విమానానికి ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తలేదు. కానీ వేరే కారణంతో ఆ విమానాన్ని అలా ల్యాండ్​ చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Flight Makes Emergency Landing: రాజస్థాన్​లోని కిషన్​గఢ్​ విమాశ్రయం నుంచి బయలుదేరి హైదరాబాద్​ రావాల్సిన విమానం టేకాఫ్​ అయిన కొద్ది సేపటికే జైపుర్​ ఎయిర్​పోర్ట్​లో అత్యవసర ల్యాండింగ్​ కావాల్సి వచ్చింది. ఇందుకు కారణం సాంకేతిక సమస్య కాదు.. ఓ ప్రయాణికుడిపై వేడి నీళ్లు పడటం. అతడు బాధతో సిబ్బంది సాయం కోరడం వల్ల విమానం ఆగింది. ఈ ఘటన బుధవారం జరిగింది.

హైదరాబాద్​కు చేరాల్సిన స్పైస్​జెట్​ విమానం కిషన్​గఢ్​ ఎయిర్​పోర్ట్​ నుంచి టేకాఫ్​ అయింది. అయితే ఇంతలో ఓ ప్రయాణికుడిపై ప్రమాదవశాత్తు అతని పక్కనే గ్లాస్​లో పెట్టుకున్న వేడినీళ్లు ముఖం మీద పడ్డాయి. దీంతో బాధకు విలవిల్లాడిన ప్రయాణికుడు తక్షణమే తనకు చికిత్స అందిచాల్సిందిగా కోరాడు. దీంతో ఏటీసీకి సమాచారం అందించిన సిబ్బంది.. జైపుర్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్​ చేశారు. బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: రోగి పొట్టలో కాటన్ వదిలేసిన డాక్టర్.. ఆస్పత్రికి రూ.45లక్షలు ఫైన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.