ETV Bharat / bharat

గన్​తో కాల్చుకున్న జవాను.. నిప్పంటించుకున్న భార్య.. అన్నకు గుండెపోటు

author img

By

Published : Mar 28, 2022, 9:48 PM IST

SUICIDE ARMY MAN
SUICIDE ARMY MAN

Army Jawan suicide: ఓ జవాను కుటుంబంలో వరుస విషాద ఘటనలు జరిగాయి. తన భార్యతో కలిసి వీడియో కాల్​ మాట్లాడుతూ జవాను ఆత్మహత్య చేసుకోగా.. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య నిప్పంటించుకొని ఆత్మహత్యకు యత్నించింది. మరోవైపు, విషయం తెలుసుకున్న జవాను సోదరుడికి గుండెపోటు వచ్చింది.

Army Jawan suicide: బిహార్​కు చెందిన ఓ జవాను తన భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్ మధ్యలోనే తనను తాను కాల్చుకున్నాడు. భర్త ఆత్మహత్య చేసుకోవడాన్ని చూసి భరించలేని భార్య.. తనువు చాలించాలని నిర్ణయించుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్రమైన కాలిన గాయాలతో ప్రస్తుతం పట్నాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటన గురించి తెలియగానే జవాను సోదరుడికి గుండెపోటు వచ్చింది. ఈ ఘటనలతో భోజ్​పుర్​లోని జవాను స్వస్థలమైన పైనియా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

SUICIDE ARMY MAN
ఆత్మహత్య చేసుకున్న జవాను

Secunderabad Jawan Suicide: జవాను మహేశ్ సింగ్(40) బిహార్ రెజిమెంట్​లో నాయక్​గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్​లోని ఆర్మీ క్యాంపస్​లో ఉంటున్నారు. ఇక్కడే తనను తాను కాల్చుకొని చనిపోయాడు. చాలా రోజుల నుంచి ఆయన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం తన భార్యతో మాట్లాడుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీడియో కాల్​లో భార్య అతడిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ.. మహేశ్ వినలేదు. భర్త మరణాన్ని లైవ్​లో చూసిన భార్య గుడియా.. తీవ్రంగా కలత చెందింది. వెంటనే తన ఒంటిపై కిరోసిన్ పోసుకుంది.

SUICIDE ARMY MAN
మహేశ్ సింగ్

ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఆమెను గమనించే సరికి.. 85 శాతానికి పైగా శరీరం కాలిపోయింది. హుటాహుటిన ఆమెను అరా సర్దార్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు.. పట్నాకు తీసుకెళ్లాలని సూచించారు. గుండెపోటుకు గురైన మహేశ్ సోదరుడు జయంత్ సింగ్ సైతం పట్నా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహేశ్ సింగ్​కు ఐదుగురు సోదరులు ఉన్నారు. అందరికన్నా మహేశే చిన్నవాడు. గ్రామంలో తన తల్లితో కలిసి వేరుగా ఉండేవాడు. 2003లో ఆర్మీలో చేరిన మహేశ్... గల్వాన్ లోయలోనూ సేవలందించాడు. ఆరు నెలల క్రితం సికింద్రాబాద్​కు మారాడు. అతడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మహేశ్ మృతదేహం మంగళవారం ఆయన స్వస్థలానికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: బాయ్​ఫ్రెండ్స్​తో కలిసి కన్నతల్లి హత్య.. కారణం తెలిస్తే షాక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.