ETV Bharat / bharat

ఇండో-పాక్ సరిహద్దుల్లో రూ.200 కోట్ల డ్రగ్స్​ స్వాధీనం!

author img

By

Published : Dec 26, 2021, 10:56 PM IST

Updated : Dec 26, 2021, 11:02 PM IST

Heroin Seized In Punjab
పంజాబ్​లో హెరాయిన్ స్వాధీనం

Heroin Seized In Punjab: పంజాబ్ వద్ద​ భారత్​ - పాక్ సరిహద్దులో భద్రతా దళాలు భారీగా మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. దాదాపు 40.64 కేజీల డ్రగ్స్​ను పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీని విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుందని అంచనా!

Heroin Seized In Punjab: పంజాబ్​ ఫిరోజ్​పుర్ సెక్టార్​లో వేర్వేరు ఘటనల్లో 40.64 కేజీల మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి సరిహద్దు భద్రతా దళాలు. సెర్చ్ ఆపరేషన్​లో భాగంగా 28 ప్యాకెట్ల డ్రగ్స్​ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. దీని విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు!.

ఓ ఘటనలో బట్టలో చుట్టిన 34.34 కేజీల డ్రగ్స్​ను గుర్తించాయి భద్రతా దళాలు. మరో ఘటనలో 6.30 కేజీల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ మత్తుపదార్థాలను హెరాయిన్​గా అనుమానిస్తున్నారు.

పంజాబ్​లో డ్రగ్స్ సరఫరా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చరణ్​జీత్ సింగ్ చన్నీ ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ సరఫరాపై నిఘా పెంచాయి బలగాలు.

Heroin Seized in indo- pak border: పంజాబ్​లోని భారత్​-పాక్ సరిహద్దు ప్రాంతంలో శనివారం భారీగా డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. అంతర్జాతీయ మార్కెట్లో వాటి విలువ రూ. 55 కోట్లు ఉంటుందని తెలిపాయి.

దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న 11 ప్యాకెట్ల హెరాయిన్​ను బర్రెక్ సరిహద్దు అవుట్ పోస్టు వద్ద గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ఎయిర్​పోర్ట్​లో రూ.72 కోట్ల విలువైన డ్రగ్స్​​​ సీజ్

Last Updated :Dec 26, 2021, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.