ETV Bharat / bharat

వాతావరణ మార్పులపై పుస్తకం.. 10 ఏళ్ల బాలుడి ఘనత

author img

By

Published : Sep 6, 2021, 8:35 AM IST

చిన్న వయసులోనే పర్యావరణ ప్రాముఖ్యతను(climate change) తెలుసుకున్న ఓ బడతడు.. ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు కృషి చేస్తున్నాడు. 10 ఏళ్లకే ఏకంగా పుస్తకమే రాశాడు. ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​, ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో(india book of records) చోటు సంపాదించాడు. అతడే.. నాలుగో తరగతి చదువుతున్న శిరీష్​.

climate change
వాతావరణ మార్పులపై పుస్తకం

వాతావరణ మార్పులపై పుస్తకం.. 10 ఏళ్ల బాలుడి ఘనత

అభివృద్ధి పేరుతో మానవుడు చేస్తున్న పనులు భూమండలానికి శాపంగా(global warming) మారుతున్నాయి. పర్యావరణ మార్పులతో(climate change) మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ సమస్యపై ఎంతో మంది పోరాడుతున్నారు. అతిచిన్న వయసులో వాతావరణ మార్పులపై అవగాహన కల్పిస్తున్న చిన్నారి గ్రేటా థన్​బర్గ్​ అందరికి సుపరిచితమే. భారత మూలాలు ఉన్న ఓ బాలుడు సైతం వాతావరణ మార్పులపై అవగాహన కల్పిస్తూ.. అందరి మన్ననలు పొందుతున్నాడు. అతనే.. నాలుగో తరగతి విద్యార్థి శిరీష్​.

Young environmentalist
తాను రాసిన పుస్తకాన్ని చూపుతున్న శిరీష్​

తమిళనాడుకు చెందిన శుభాష్​ అరుముగమ్​, తన కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. జార్జియాలోని ఓ సాఫ్ట్​వేర్​ సంస్థలో పని చేస్తున్నారు. ఆయన కుమారుడే శిరీష్​. మరియెట్ట సెంటర్​ ఫర్​ అడ్వాన్స్​డ్​ అకాడమిక్స్​లో 4వ తరగతి చదవుతున్నాడు. ఎంతో చురుకుగా ఉండే శిరీష్​లోని నైపుణ్యాన్ని గుర్తించిన టీచర్​ అజాలా హెర్బల్​.. సైన్స్​ వైపు ప్రోత్సహించింది. ఈ క్రమంలోనే ఐదున్నరేళ్ల వయసులో ఉన్నప్పుడు పర్యావరణ మార్పులపై వచ్చిన 'బిఫోర్​ ది ఫ్లడ్​' అనే డాక్యుమెంటరీ చూశాడు శిరీష్​. మరింత తెలుసుకునే ప్రయత్నంలో.. వాతారవణ మార్పులపై తన వంతుగా కృషి చేయాలని నిశ్చయించుకున్నాడు.

ఈ క్రమంలోనే 2018లో తన పుట్టిన రోజు సందర్భంగా పర్యావరణ మార్పులపై తన ఆలోచనలను స్నేహితులతో పంచుకున్నాడు శిరీష్​. ఎనిమిదేళ్ల వయసులో ఈ సమస్యపై 'కార్బన్​ బ్లాక్​ పజిల్​' పుస్తకం(book on climate change) రాయటం ప్రారంభించాడు. 10 ఏళ్లు వచ్చేసరికి విజయవంతంగా పూర్తి చేశాడు. ఆ పుస్తకాన్ని అమెజాన్​లో విక్రయానికి పెట్టగా.. ప్రపంచవ్యాప్తంగా 150కిపైగా మంది చదివారు.

Young environmentalist
వాతావరణ మార్పులపై అవగాహన

రికార్డులు..

పర్యావరణ మార్పులపై(climate change causes) పుస్తకం రాసి.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న క్రమంలో శిరీష్​కు ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​, ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో చోటు దక్కింది. మరోవైపు.. శిరీష్​ ఐక్యూ స్థాయిని పరీక్షించిన పాఠశాల యాజమాన్యం.. నాలుగో తరగతి నుంచి ఆరో తరగతికి పంపించారు.

Young environmentalist
స్పెల్లింగ్​ బీ పోటీల్లో రెండో స్థానం సాధించిన శిరీష్​

"కార్బన్​ బ్లాక్​ పజిల్ పుస్తకంలో పర్యావరణ మార్పులు, వాటి ప్రభావం, నివారణపై రాశాను. అలాగే వాతావరణ మార్పులను తగ్గించేందుకు ప్రజలను ఈ పుస్తకం ప్రోత్సహిస్తుంది. భారత్​లో పర్యావరణ మార్పుల సమస్య వేగంగా పెరుగుతోంది. వాతావరణ మార్పులు అనేది అంతర్జాతీయ సమస్య. ఒక్కొ దేశంలో ఒక్క స్థాయిలో ఉంది. భారత్​లో ఆ సమస్య మరింత ఆందోళనకరంగా ఉంది. గణాంకాలను పరిశీలిస్తే.. సముద్ర మట్టం వేగంగా పెరుగుతున్నందన భారత్​లోని చాలా తీర ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది."

- శిరీష్​, విద్యార్థి

భావిష్యత్తులో పర్యావరణవేత్తగా(young climate activists) మారాలనుకుంటున్నానని, వాతావరణ మార్పులపై ప్రతిఒక్కరికి అవగాహన కల్పిస్తానని చెప్పాడు. శిరీష్​కు అన్ని విధాల అండగా నిలుస్తున్నారు తల్లిదండ్రులు. పర్యావరణ మార్పులకు మంచి పరిష్కారం కనుగొంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

Young environmentalist
తల్లిదండ్రులతో శిరీష్​
Young environmentalist
నాసా శాస్త్రవేత్తతో శిరీష్​
Young environmentalist
స్టూడెంట్​ ఆఫ్​ ద మంత్​గా శిరీష్​
Young environmentalist
పర్యావరణాన్ని కాపాడాలని అవగాహన కల్పిస్తున్న విద్యార్థి

ఇదీ చూడండి: వాతావరణ మార్పులపై మేలుకోకుంటే తప్పదు విపత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.