ETV Bharat / bharat

రైతులకు ఏడాది ఫ్రీగా భోజనం పెట్టిన లంగర్​.. ఇకపై రెస్టారెంట్​!

author img

By

Published : Dec 12, 2021, 5:20 PM IST

Updated : Dec 12, 2021, 8:37 PM IST

Golden Hut Restaurant: దిల్లీ సింఘు సరిహద్దుల్లో రైతుల నిష్క్రమణతో.. అక్కడి ప్రముఖ గోల్డెన్​ హట్​ రెస్టారెంట్​ తిరిగి తెరుచుకొనేందుకు సిద్ధమైంది. రైతు ఆందోళనల కారణంగా ఈ రెస్టారెంట్​ మూతబడినప్పటికీ వారికి సొంత ఖర్చుతో అక్కడ ఏడాదిపాటు భోజనం ఏర్పాటు చేశారు యజమాని రాణా రాంపాల్​. మరోవైపు.. గాజీపుర్​ సరిహద్దుల్లో రైతులు లక్షలు వెచ్చించి నిర్మించుకున్న హౌస్​ ఆన్​ వీల్స్​ను తమ జ్ఞాపకంగా మలుచుకోనున్నారు.

Golden hut restaurant-owner
తెరుచుకోనున్న గోల్డెన్​ హట్​ రెస్టారెంట్​ Golden hut restaurant-owner

రైతులకు ఏడాది ఫ్రీగా భోజనం పెట్టిన లంగర్​.. ఇకపై రెస్టారెంట్

Golden Hut Restaurant: కేంద్ర ప్రభుత్వం హామీతో దిల్లీ సరిహద్దుల్లో నిరసనలకు ముగింపు పలికిన రైతులు.. తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ట్రాక్టర్లు, ఇతర వాహనాల మీద విజయయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు.

farmers-at-singhu-border
వెనుదిరుగుతున్న రైతులు

ఈ నేపథ్యంలో.. రైతు ఆందోళనల కారణంగా సింఘు సరిహద్దులో మూతపడ్డ గోల్డెన్​ హట్​ రెస్టారెంట్​ తిరిగి తెరుచుకొనేందుకు సిద్ధమైంది. ఏడాదిగా రెస్టారెంట్​లో.. రైతులకు లంగరు (ఉచిత భోజనశాల) ఏర్పాటుచేసి పెద్ద మనసు చాటుకున్నారు గోల్డెన్​ హట్​ యజమాని రాణా రాంపాల్​ సింగ్​. ఇందుకోసం ఆయన రోజుకు రూ. 4 లక్షలు వెచ్చించారు. ఇప్పుడు రైతులు సరిహద్దులను ఖాళీ చేస్తున్న క్రమంలో కస్టమర్ల కోసం తిరిగి తెరుచుకోనుంది.

farmers-at-singhu-border
గోల్డెన్​ హట్​ రెస్టారెంట్​
farmers-at-singhu-border
రైతులకు ఏడాదిగా భోజనశాలగా మారిన గోల్డెన్​ హట్​ రెస్టారెంట్​
farmers-at-singhu-border
రాణా రాంపాల్​ సింగ్​, గోల్డెన్​ హట్​ యజమాని

''రైతులు నాకు కుటుంబంతో సమానం. వారి విజయం పట్ల సంతోషంగా ఉన్నా. ఒక్క రైతు ఉన్నా.. లంగరు కొనసాగుతోంది.''

- రాణా రాంపాల్​ సింగ్​, గోల్డెన్​ హట్​ యజమాని

'హెరిటేజ్​ హోం'గా హౌస్​ ఆన్​ వీల్స్​..

House on Wheels into heritage home: గాజీపుర్​ సరిహద్దుల్లో రైతులు నిర్మించుకున్న హౌస్​ ఆన్​ వీల్స్​ను.. 'హెరిటేజ్​ హోం'గా మార్చాలని రైతులు యోచిస్తున్నారు. సుదీర్ఘ ఉద్యమానికి జ్ఞాపకంగా, రైతుల పోరాటాన్ని భవిష్యత్తు తరాలు గుర్తుంచుకొనేలా అలాగే ఉంచనున్నారు.

farmers-at-singhu-border
హౌస్​ ఆన్​ వీల్స్​

ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు సులభంగా తరలించేలా 30 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పులో.. చక్రాలపై ఈ ఇంటిని నిర్మించారు. ఇటుకలు, సిమెంట్​, ఐరన్​, ప్లైవుడ్​, గడ్డి అన్నింటినీ వాడారు. దీని కోసం రూ. 4.5 లక్షలు వెచ్చించినట్లు గుడ్డూ ప్రధాన్​ అనే రైతు చెప్పుకొచ్చారు.

హౌస్​ ఆన్​ వీల్స్​లో రెండు గదులు ఉంటాయి. రిఫ్రిజరేటర్​, ఏసీలు, టీవీలు సహా ఎన్నో సదుపాయాలు ఇందులో ఉన్నాయి. వంతుల వారీగా రైతులు నిరసనల సమయంలో అక్కడ నిద్రించారు.

వెనుదిరుగుతున్న రైతులు..

Farmers Returning Back: డిసెంబర్​ 15లోగా రైతులంతా సరిహద్దులను ఖాళీ చేయనున్నట్లు స్పష్టం చేశారు భారతీయ కిసాన్​ యూనియన్​ నాయకుడు రాకేశ్​ టికాయిత్​. జనవరి 15న సంయుక్త కిసాన్​ మోర్చా సమావేశం నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

''డిసెంబర్​ 15లోగా రైతులంతా నిరసన ప్రదేశాలను ఖాళీ చేస్తారు. హరియాణా, ఛండీగఢ్​, అమృత్​సర్​లో నిరసనలకు ముగింపు పలికేందుకు 3 రోజులపాటు ఆయా ప్రాంతాలకు వెళ్తున్నా.''

- రాకేశ్​ టికాయిత్​, బీకేయూ నాయకుడు

బారికేడ్ల తొలగింపు..

సింఘు సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగిస్తున్నారు అధికారులు. రైతు నిరసనల సమయంలో వారిని కట్టడి చేసేందుకు వీటిని ఏర్పాటు చేశారు.

Farm Laws Repeal

సాగు చట్టాల రద్దు సహా ఇతర డిమాండ్లను పరిష్కరించాలని రైతులు గతేడాది నవంబర్ నుంచి దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్నారు. ఇటీవల నవంబర్​ 19న ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నవంబర్​ 29న సంబంధిత బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ సమ్మతితో.. సాగు చట్టాలు రద్దయ్యాయి.

farmers-at-singhu-border
కార్లలో ఇళ్లకు వెళ్తున్న రైతులు

అనంతరం.. కనీస మద్దతు ధరపైనా కేంద్రం రైతులకు భరోసా కల్పించింది. దీంతో రైతు నిరసనలకు తెరపడింది. నిరసన ప్రాంతాల నుంచి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇప్పటికే సగం మందికిపైగా పయనమయ్యారు.

ఇవీ చూడండి: దిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తున్న రైతులు- విజయ యాత్రతో స్వస్థలాలకు

Farmers protest end: సుదీర్ఘ నిరసనలకు తెర- ఇళ్లకు రైతులు

Last Updated :Dec 12, 2021, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.