స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే ?

author img

By

Published : Jan 31, 2023, 12:43 PM IST

gold

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధర రూ.254 తగ్గి.. ప్రస్తుతం రూ.58,830 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.87 స్వల్పంగా తగ్గి ప్రస్తుతం రూ. 70,100 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.58,830 గా ఉంది. కిలో వెండి ధర రూ.70,100 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.58,830 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,100గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,830గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,100 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.58,830 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.70,100 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1915.60 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 23.48 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.18,60,063 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.18,60,063
ఇథీరియంరూ.1,27,688
టెథర్​రూ.81.67
బైనాన్స్​ కాయిన్​రూ.25,342
యూఎస్​డీ కాయిన్రూ.81.70

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మొదట ఫ్లాట్‌గా ట్రేడింగ్​గా ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 191 పాయింట్ల నష్టంతో 59,304 వద్ద ట్రేడవ్వగా.. నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 17,595 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌30 సూచీలో ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్‌, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

రూపాయి మారకం..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు తగ్గి 81.64 వద్ద ట్రేడవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.