ETV Bharat / bharat

ఉద్యోగం ఇప్పిస్తామని యువతిపై గ్యాంగ్​ రేప్​.. కారులోనే దారుణం..

author img

By

Published : Apr 13, 2023, 9:17 PM IST

gangrape in delhi
gangrape in delhi

దిల్లీలో ఓ యువతిపై గ్యాంగ్​రేప్ జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియోలు తీసి ఆమెను బ్లాక్​మెయిల్​​ చేశారు. మరోవైపు, ఓ మహిళపై తన సోదరుడి స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ప్రైవేటు వీడియోను వాట్సాప్​లో సర్క్యులేట్​ చేశాడు. డబ్బు, నగల కోసం దిల్లీలో ఓ వృద్ధురాలిని.. పనిమనిషి హత్య చేసింది.

దేశ రాజధాని దిల్లీలో ఓ యువతిని గ్యాంగ్ రేప్​ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇస్తానని ఓ వ్యక్తి.. అతడితో పాటు మరో ఇద్దరు యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని వీడియో తీసి బాధితురాలిని బెదిరించారు. అత్యాచారం విషయం పోలీసులకు చెబితే వీడియోను ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేస్తామని బ్లాక్​ మెయిల్​ చేశారు.

పోలీసులు తెలిపిన వివారల ప్రకారం.. దిల్లీకి చెందిన ఓ యువతి(19)కి.. 2020లో సోషల్​ మీడియా ద్వారా అనుభవ్​ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఉద్యోగం ఇప్పిస్తానని యువతికి అతడు ఆశచూపించాడు. ఇటీవల నగరంలోని మాలవీయ నగర్​ మెట్రోస్టేషన్​ వద్దకు రమ్మని చెప్పాడు. నిందితుడిని నమ్మిన సదరు యువతి.. అతడు చెప్పిన ప్లేస్​కు వెళ్లింది. అయితే, అక్కడ అనుభవ్.. తన ఇద్దరు స్నేహితులతో కారులో ఎదురుచూశాడు. యువతిని కారు ఎక్కించుకుని కొంతదూరం తీసుకెళ్లాడు. బేగంపుర్​ ప్రాంతం వద్దకు రాగానే కారు ఆపి.. నిందితులు యువతిని రేప్​ చేశారు. అఘాయిత్యం చేసేటప్పుడు వీడియో కూడా తీశారు. 'పోలీసులకు చెబితే.. ఈ వీడియో సోషల్​ మీడియాలో అప్​లోడ్​ చేస్తాం' అని యువతిని బెదిరించారు. ఈ మేరకు సదరు యువతి బుధవారం మాలవీయ నగర్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్లు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు దిల్లీ సౌత్​ డీసీపీ చందన్​ చౌదరీ తెలిపారు.

రేప్​ చేసిన సోదరుడి ఫ్రెండ్​..
ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. ఓ మహిళపై ఆమె సోదరుడి స్నేహితుడు అత్యాచారం చేశాడు. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం ఆమె ప్రైవేటు వీడియోను వాట్సాప్​లో సర్క్యూలేట్​​ చేశాడు. బాలియా జిల్లాలో ఏప్రిల్​ 6న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.

వృద్ధురాలిని చంపేసిన పనిమనిషి..
దిల్లీలో ఓ వృద్ధురాలిని పనిమనిషి మరో వ్యక్తి సహాయంతో హతమార్చింది. అనంతరం డబ్బు, నగలతో ఉడాయించింది. ఈ ఘటన బిందాపుర్​లోని ఓం విహార్​ ప్రాంతంలో బుధవారం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉష(66) అనే వృద్ధురాలు ఓం విహార్​ ప్రాంతంలో నివాసముంటోంది. ఆమెకు శరీరం సహకరించకపోవడం వల్ల పనిమనిషిని ఏర్పాటు చేసుకుంది. వృద్ధురాలి అసహాయతను ఆసరాగా తీసుకున్న పనిమనిషి.. డబ్బు, నగలు కాజేయాలని పథకం పన్నింది. వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తితో కలసి ఆమెను హతమార్చింది. అనంతరం డబ్బు, నగలతో పారిపోయింది. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పోలీసులకు ఈ సమాచారం అందింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను ఆ రోజు రాత్రి గోరఖ్​పుర్​ రైల్వే స్టేషన్​ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.