ETV Bharat / bharat

Gandhi Peace Prize Venkaiah Naidu : గాంధీ శాంతి బహుమతి జ్యూరీలో వెంకయ్య.. మోదీ ఆమోదంతో..

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 8:03 PM IST

Updated : Oct 21, 2023, 8:32 PM IST

Gandhi Peace Prize Venkaiah Naidu : ప్రతిష్ఠాత్మక గాంధీ శాంతి బహుమతి జ్యూరీలో నామినేటెడ్​ సభ్యుడిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

Gandhi Peace Prize Venkaiah Naidu
Gandhi Peace Prize Venkaiah Naidu

Gandhi Peace Prize Venkaiah Naidu : ప్రతిష్ఠాత్మక గాంధీ శాంతి బహుమతి జ్యూరీలో నామినేటెడ్‌ సభ్యునిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నియామకానికి ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 1995లో గాంధీజీ 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం గాంధీ శాంతి బహుమతి పేరుతో అవార్డును ఏర్పాటు చేసింది. ఈ అవార్డు కింద కోటి రూపాయల నగదుతో పాటు, ప్రశంసా పత్రం, చేనేత వస్తువును అందజేస్తారు. ప్రధాన మంత్రి ఈ జ్యూరీకి అధ్యక్షుత వహిస్తారు. 'ప్రధాని మంత్రి మిమ్మల్ని నామినేటెడ్ సభ్యునిగా నియమించారనే విషయాన్ని తెలియజేయడం నాకు గౌరవంతో పాటు ఆనందాన్ని కలిగిస్తోంది' అని వెంకయ్య నాయుడుకి రాసిన లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వెంకయ్య నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా వ్యవహరించారు. రాజ్యసభకు సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు. జాతీయ రాజకీయాల్లోకి రాకముందు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978 నుంచి 2017 వరకు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. అన్ని భాషల్లో అంత్యప్రాసలతో ఆయన చేసే ప్రసంగం పండితుల నుంచి పామరుల వరకు అందర్నీ అలరిస్తుంది. దక్షిణాదిలో వాజ్‌పేయీ ప్రసంగాలను తెలుగులోకి తర్జుమా చేసేవారు. వాజ్‌పేయీ, ఆడ్వాణీలను వికాస్‌ పురుష్‌, లోహ్‌ పురుష్‌లుగా అభివర్ణించి వారి అభిమానాన్ని చూరగొన్నారు. ఒకప్పుడు ఆడ్వాణీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఆయన 2014 ఎన్నికలకు ముందు మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా బలంగా సమర్థించారు. ఆ తర్వాత ఆయన హయాంలో పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు.

2002 నుంచి 2004 వరకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన.. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి బాధ్యత వహిస్తూ ఆ పదవి నుంచి వైదొలిగారు. 2017 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన అనంతరం రాజ్యసభ ఛైర్మన్‌గా సభను చాకచక్యంగా నడిపించారు. జమ్మూకశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దు బిల్లులను అత్యంత ఒడుపుతో రాజ్యసభలో గట్టెక్కించి కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఉపశమనం కల్పించారు. సంక్లిష్ట సమయాల్లో తన రాజకీయ అనుభవాన్ని రంగరించి సభను చాకచక్యంగా ముందుకు నడిపించారు. ఒకవైపు పెద్దరికంతో, ఓర్పుతో వ్యవహరిస్తూనే మరోవైపు కఠిన చర్యలూ వెనకాడలేదు. తన ముందుకొచ్చిన ఏ సమస్యనైనా అత్యంత వేగంగా పరిష్కరించడం ఆయనకు అలవాటు. భారత ఉపరాష్ట్రపతిగా ఆయన 2022 ఆగస్టు 10న పదవీకాలం పూర్తి చేసుకున్నారు.

అజాతశత్రువు... వెంకయ్య నాయుడు!

American award to Venkaiah Naidu : 'వెంకయ్యనాయుడు సేవలకు మరో గుర్తింపు.. న్యూజెర్సీ అసెంబ్లీలో తీర్మానం'

Last Updated :Oct 21, 2023, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.