క్రీడాకారిణులకు టాయిలెట్‌లో భోజనం.. వీడియో వైరల్​.. అధికారి సస్పెండ్​

author img

By

Published : Sep 20, 2022, 2:25 PM IST

Updated : Sep 20, 2022, 3:12 PM IST

Food Served In Toilet

Food Served In Toilet : క్రీడాకారిణులకు టాయిలెట్‌లో భోజనం వడ్డించిన ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌లో తీవ్ర దుమారం రేగింది. రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో భాగంగా ఈ సంఘటన జరిగింది. స్థలం లేని కారణంగానే ఇలా చేశామని స్థానిక అధికారులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు.. జిల్లా క్రీడాధికారిణిపై వేటు వేసి దర్యాప్తునకు ఆదేశించారు

Food Served In Toilet : ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా టోర్నమెంట్‌లో దారుణం జరిగింది. బాలికలకు అధికారులు టాయిలెట్లలో భోజనాలు ఏర్పాట్లు చేశారు. సహరన్‌పుర్ జిల్లాలో ఈనెల 16న అండర్‌-17 బాలికల కబడ్డీ టోర్నమెంట్‌ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 మంది క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. అయితే ఈ పోటీల సమయంలో తమకు స్టేడియం టాయిలెట్‌లో భోజనాలు ఏర్పాటు చేసినట్లు కొందరు జూనియర్‌ ఆటగాళ్లు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా బయటికొచ్చాయి. టాయిలెట్‌ గదిలో వంటపాత్రలు ఉండగా అందులో నుంచి అమ్మాయిలు వడ్డించుకున్నట్లు వీడియోలో ఉంది. ఒక చోట అయితే పూరీలను నేలపై ఓ పేపర్‌లో వేసి పెట్టారు.

స్థలం లేనందునే ఇలా చేశామని అధికారులు వివరణ ఇవ్వడం మరిన్ని విమర్శలకు దారితీసింది. భోజనాలను టాయిలెట్‌లో ఏర్పాటు చేయలేదని.. తప్పనిసరి పరిస్థితుల్లో వంటపాత్రలను బట్టలు మార్చుకునే గదిలో పెట్టాల్సి వచ్చిందని సహరన్‌పుర్‌ జిల్లా క్రీడాధికారి అనిమేశ్‌ సక్సేనా చెప్పారు. ప్రస్తుతం స్టేడియం నిర్మాణదశలో ఉందని వర్షం కారణంగా వంటపాత్రలు పెట్టేందుకు స్థలం లేకపోవడం వల్ల స్విమ్మింగ్‌ పూల్‌ పక్కనే ఉన్న దుస్తులు మార్చుకునే గదిలో పెట్టామని సక్సేనా చెప్పారు. ఈ ఘటనపై చర్యలు చేపట్టిన ఉన్నతాధికారులు.. సహరన్‌పుర్ జిల్లా క్రీడా అధికారిని సస్పెండ్‌ చేశారు. అనంతరం ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించారు.

ఇవీ చదవండి: థరూర్​ X గహ్లోత్.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో వీరి​ మధ్యే పోటీ!

నకిలీ సీఎం అరెస్ట్​.. శిందే వేషధారణలో నేరస్థులతో ఫొటోలు..

Last Updated :Sep 20, 2022, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.