ETV Bharat / bharat

మహారాష్ట్రలో వరద బీభత్సం- 209కి చేరిన మృతులు

author img

By

Published : Jul 28, 2021, 12:26 AM IST

మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరద బీభత్సానికి 200 మందికి పైగా చనిపోయారు. 58 వేలకు పైగా పశువులు, పక్షులు మృతిచెందాయి. రాష్ట్రంలో ఇప్పటికీ ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

maharashtra floods latest news, మహారాష్ట్ర వరద బీభత్సం
మహారాష్ట్రలో వరద బీభత్సం- 209కి చేరిన మృతులు

కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలు మహారాష్ట్రను అతలాకుతలం చేశాయి. వరదలు, కొండచరియల కారణంగా మంగళవారం (జులై 27) నాటికి 209 మంది చనిపోయారు. మరో 8 మంది గల్లంతయ్యారు. 58, 722 పశుపక్ష్యాదులు మృతిచెందాయి. 4,34,185 మందిని సురక్షిత ప్రాంతాలకు తరిలించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది.

ముంబయి, రాయ్​గఢ్​, రత్నగిరి, పాల్ఘడ్​, ఠాణె, సింధుదుర్గ్​, కోల్హాపుర్​, సతారా, సంగ్లీ జిల్లాల్లో వర్షాలు కల్లోలం సృష్టించాయి. ప్రస్తుతం 16 ఎన్​డీఆర్​ఎఫ్​, 3 ఆర్మీ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

308 వసతి కేంద్రాల్లో 2.51 లక్షల మందికి భోజన, వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. తీవ్రంగా ప్రభావితమైన రాయ్​గఢ్​, రత్నగిరి జిల్లాలకు రూ.2 కోట్లు చొప్పున, ఇతర జిల్లాలకు రూ.50లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.

రాయ్​గఢ్​ జిల్లా కొండల్కర్​ వాడిలో గవర్నర్​ భగత్​ సింగ్ కోశ్యారీ పర్యటించి ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలపై ఆరా తీశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ గ్రామస్థులకు పునరావాసం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు.

maharashtra floods latest news, మహారాష్ట్ర వరద బీభత్సం
రాయగఢ్​ జిల్లాలో పర్యటించిన గవర్నర్​

రత్నగిరి- వర్ష బీభత్సానికి వణికిపోయిన చిప్లున్ పట్టణంలో బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు కోశ్యారీ.

maharashtra floods latest news, మహారాష్ట్ర వరద బీభత్సం
రత్నగిరి జిల్లాలో గవర్నర్​ పర్యటన

సింధుదుర్గ్- భారీ వానలకు జిల్లాలో ఎన్నో జీవితాలు ఛిద్రమయ్యాయి. 39 గ్రామాల్లో 290 కుటుంబాల్లోని 1,271 మందిని సురక్షిత ప్రాంతాలకు తరిలించారు.

maharashtra floods latest news, మహారాష్ట్ర వరద బీభత్సం
సింధుదుర్గ్​ జిల్లాలో జలమయం అయిన రోడ్లు

కోల్హాపుర్- ఇబ్రహీం బుజ్వాడేలో పౌల్ట్రీ షెడ్డులో వరదల కారణంగా 3,500 పక్షులు బలికాగా, 70 బ్యాగుల ధాన్యం నీటిపాలైంది.

సంగ్లీ- వర్ణ, కృష్ణ నదుల వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ అనేక గ్రామాలు ఇంకా ముంపులో కొనసాగుతున్నాయి. అయితే వరదల కారణంగా పట్టణాలను మొసళ్ల భయం వెంటాడుతోంది.

maharashtra floods latest news, మహారాష్ట్ర వరద బీభత్సం
సంగ్లీ జిల్లాలో వరదలకు ఓ ఇంటి పైకప్పుకు చేరిన మొసలి

సతారా- జిల్లాకు రూ.100కోట్ల ప్రత్యేక నిధులు ప్రకటించారు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్. మృతుల కుటుంబాలకు రూ.7 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. 125 ఏళ్లలోనే మినీ కశ్మీర్​గా పేరు గాంచిన మహాబలేశ్వర్​లో ఈ ఏడాది రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. జులై 22, 23న 1,074.04 ఎంఎం వర్షపాతం నమోదైంది.

maharashtra floods latest news, మహారాష్ట్ర వరద బీభత్సం
మహాబలేశ్వర్​లో వరద ఉద్ధృతి

కేంద్రం సాయం..

మహారాష్ట్రకు వరద సహాయం కింద రూ.701 కోట్లను మంజూరు చేసింది కేంద్రం. కర్ణాటకకు మరో రూ.629 కోట్లు కేటాయించింది.

ఇదీ చూడండి : దిల్లీలో భారీ వర్షాలు- జనజీవనం అస్తవ్యస్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.