ETV Bharat / bharat

ఒమిక్రాన్ నుంచి కోలుకున్నా.. ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

author img

By

Published : Dec 31, 2021, 12:59 PM IST

Updated : Dec 31, 2021, 2:29 PM IST

first omicran death in India
దేశంలో మొదటి ఒమిక్రాన్​ మరణం నమోదు

12:53 December 31

రాజస్థాన్​లో వృద్ధుడు మృతి

India Omicron death: ఒమిక్రాన్ నుంచి కోలుకున్న 73 ఏళ్ల వృద్ధుడు.. ఉదయ్​పుర్​ ఆసుపత్రిలో శుక్రవారం మరణించినట్లు వైద్యాధికారులు తెలిపారు. డిసెంబరు 21, 25 తేదీల్లో ఆ వ్యక్తికి రెండుసార్లు ఒమిక్రాన్​ పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు.

చనిపోయిన వ్యక్తి పోస్ట్-కొవిడ్ నిమోనియాతో బాధపడుతున్నాడని ఉదయపుర్​ సీఎంహెచ్​ఓ డాక్టర్ దినేష్ ఖాధ్రీ వివరించారు. డయాబెటిస్ మెల్లిటస్, హైపర్‌టెన్షన్​ తో పాటు హైపో థైరాయిడిజంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. పోస్ట్​ కొవిడ్​ నిమోనియా కారణంగా ఆ వృద్ధుడు చనిపోయినట్లు స్పష్టం చేశారు.

డిసెంబరు 15న ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని... ఈ క్రమంలోనే జ్వరం, దగ్గు, రినైటిస్‌ వంటి లక్షణాలతో బాధపడుతుండడం కారణంగా ఆసుపత్రిలో చేర్పించినట్లు పేర్కొన్నారు.

ఉదయ్​పుర్​లో ఇప్పటి వరకు 3 ఒమిక్రాన్​ కేసులు నమోదు కాగా.. రాజస్థాన్​ రాష్ట్రంలో మొత్తం 69 కేసులు వెలుగు చూశాయి.

Last Updated :Dec 31, 2021, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.