ETV Bharat / bharat

పెంపుడు కుక్క మొరిగిందని గొడవ.. యజమానిపై కాల్పులు

author img

By

Published : Apr 14, 2022, 10:32 AM IST

three shot on dispute over dog barking in ghaziabad
three shot on dispute over dog barking in ghaziabad

dispute over dog barking: పెంపుడు శునకం మొరుగుతోందన్న కోపంతో దాని యజమానిపై కాల్పులు జరిపారు ఇద్దరు వ్యక్తులు. ఈ విషయంపై తరచూ గొడవ పెట్టుకుంటున్న నిందితులు.. మంగళవారం ఏకంగా తుపాకీకి పనిచెప్పారు. ఈ ఘటనలో మరో ఇద్దరికీ గాయాలు అయ్యాయి.

dispute over dog barking: పక్కింటి పెంపుడు కుక్క మొరుగుతోందని ఇద్దరు వ్యక్తులు ఆ కుటుంబంపై కాల్పులు జరిపారు. ఉత్తర్​ప్రదేశ్ గాజియాబాద్​లోని బాపూధామ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పెంపుడు కుక్క యజమానితో పాటు అతడి ఇద్దరు కుమారులపై నిందితులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. నిందితులను అఠన్నీ, చవాన్నీగా గుర్తించారు. వీరిద్దరినీ అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

three shot on dispute over dog barking in ghaziabad
ఆస్పత్రిలో బాధితుడు

బాధితుడు సుశీల్​ ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. అయితే, కుక్క పదేపదే అరుస్తోందని నిందితులు తరచుగా కోప్పడేవారు. ఇదే విషయంలో మంగళవారం గొడవ జరగ్గా.. నిందితులు సుశీల్​పై కాల్పులు చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితులను ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. చాక్లెట్​ కోసం డబ్బులిచ్చి మరో ఘటనలో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.