ETV Bharat / bharat

ఈటీవీ భారత్​కు ప్రతిష్ఠాత్మక అవార్డు

author img

By

Published : Mar 4, 2021, 11:18 PM IST

Updated : Mar 5, 2021, 3:03 AM IST

ఈటీవీ భారత్​ను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. అక్షరాస్యతా వార్తల విభాగంలో దక్షిణాసియా​ డిజిటల్​ మీడియా అవార్డును కైవసం చేసుకుంది. డిజిటల్​ విద్యలో పేదలు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, సంపన్న కుటుంబాల పిల్లలకు మధ్య వ్యత్యాసానికి సంబంధించిన కథనాలను ప్రచురించినందుకు గానూ ఈ గౌరవం దక్కింది.

ETV Bharat wins prestigious South Asian Digital Media award
ఈటీవీ భారత్​కు ప్రతిష్టాత్మక దక్షిణాసియా డిజిటల్​ మీడియా అవార్డు

అర చేతిలో వార్తా ప్రపంచాన్ని కళ్ల ముందుంచే ఈటీవీ భారత్​కు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. అక్షరాస్యతా వార్తల విభాగంలో ఉత్తమ కథనాలను అందించినందుకు గానూ దక్షిణాసియా డిజిటల్​ మీడియా అవార్డు లభించింది. డిజిటల్​ విద్యలో పేదలు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, సంపన్న కుటుంబాల పిల్లలకు మధ్య వ్యత్యాసానికి సంబంధించిన కథనాలను ప్రచురించినందుకు గానూ ఈ గౌరవం దక్కింది.

కరోనా కాలంలో ఆన్​లైన్​ విద్యా బోధన కారణంగా పేద, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు, అంతర్జాల సదుపాయాలు లేక ఆన్​లైన్​ తరగతులకు హాజరుకాలేకపోయిన పిల్లల గురించి ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ, ప్రవేటు సంస్థలు చొరవ తీసుకోవాల్సిన అవసరముందని చాటిచెప్పింది. ఈ కథనాలకు గానూ వరల్డ్ అసోషియేషన్‌ ఆఫ్ న్యూస్‌పేపర్స్అండ్‌ న్యూస్‌ పబ్లిషర్స్‌-వాన్‌-ఇన్‌ఫ్రా.. దక్షిణాసియా డిజిటల్ మీడియా అవార్డు దక్కింది.

Last Updated : Mar 5, 2021, 3:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.