ETV Bharat / bharat

70 ఏళ్లు దాటిన చెట్లకు పింఛన్- ఎందుకంటే?

author img

By

Published : Mar 2, 2021, 8:18 PM IST

pension for elder trees
70 ఏళ్లు దాటిన చెట్లకు పింఛన్- ఎందుకంటే?

ఇకపై ఆ రాష్ట్రంలో చెట్లకు కూడా పింఛన్ అందనుంది. మనుషులకు వృద్ధాప్య పింఛన్​లా.. వయసు అధికంగా ఉన్న చెట్లకు నగదు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులైన చెట్ల వివరాలనూ సేకరించాలని ఆదేశించింది. చెట్లకు పెన్షన్ ఏంటీ అని అనుకుంటున్నారా? ఎక్కడో తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకేం ఆలస్యం!

హరియాణా అటవీ శాఖ మంత్రి కన్వర్​పాల్ గుర్జర్ ఆలోచన ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది. చెట్లకు పింఛన్ ఇవ్వాలన్న ఆయన సలహా ఇప్పుడు చట్ట ప్రకారం అమలులోకి రానుంది.

రాష్ట్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చెట్లకు పెన్షన్ ఎందుకు ఇవ్వకూడదంటూ ప్రశ్నించారు కన్వర్​పాల్ గుర్జర్. అధిక వయసు ఉన్న చెట్లకు పింఛన్ ఇస్తే వాటిని సంరక్షించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. వృక్షాల నిర్వహణ సైతం సక్రమంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడీ ఆలోచనను రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా అమలులోకి తీసుకొస్తున్నారు.

ఆదేశాలు జారీ

70 ఏళ్లపైబడిన చెట్లను గుర్తించాలని 'వన్ భవన్' నుంచి ఆదేశాలు జారీ అయినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. చెట్ల జాబితా తయారు చేసే బాధ్యతను రేంజ్ అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. వేప, మామిడి, జామ, ఇండియన్ రోజ్​వుడ్, తుమ్మ, రావి చెట్లకు పింఛన్ అందించనున్నట్లు తెలిపారు. నీలగిరి, చైనాబెర్రీ చెట్లను ఈ పథకం నుంచి మినహాయించినట్లు వివరించారు.

ఒక్కో గ్రామానికి వెళ్లి చెట్ల వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అడవుల్లోనూ చెట్లను గుర్తించినట్లు తెలిపారు. గుళ్లలో ఉన్న చాలా చెట్ల వయసు డెబ్బై ఏళ్లపైనే ఉందని వెల్లడించారు.

ఇదీ చదవండి: కాసేపట్లో పోస్ట్​మార్టమ్​.. అంతలోనే కదలిక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.