ETV Bharat / bharat

నవజాత శిశువు కడుపులో 8 పిండాలు.. షాక్​లో కుటుంబ సభ్యులు

author img

By

Published : Nov 3, 2022, 1:15 PM IST

eight-fetus-from-stomach-of-newborn-girl-in-ranchi
eight-fetus-from-stomach-of-newborn-girl-in-ranchi

కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ నవ జాత శిశువును ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే ఆ పాపకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ఆమె కడుపులో నుంచి ఎనిమిది పిండాలను వెలికితీశారు. దీంతో ఆ కుటుంబసభ్యులు షాక్​కు గురయ్యారు.

ఝార్ఖండ్ ఓ నవజాత శిశువుకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. ​ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో జరిగిన ఈ ఆపరేషన్​లో 21 రోజుల పసికందు కడుపులో నుంచి ఎనిమిది పిండాలను తొలగించారు వైద్యులు. ఇలాంటి కేసును చూడటం ఇదే మొదటిసారి అని తెలిపారు.
రాంచీలోని రామ్‌ఘర్‌లో అక్టోబర్ 10న జన్మించిన ఓ బాలికకు కడుపునొప్పి వచ్చిందని కుటుంబసభ్యులు స్థానిక ప్రైవేట్​ ఆస్పత్రిలో చేర్పించారు. బిడ్డ కడుపులో కణితులు ఉన్నట్లు అనుమానించిన వైద్యులు సీటీ స్కాన్​ చేశారు. 21 రోజులు అబ్జర్వేషన్​లో ఉంచిన తర్వాత నవంబర్​ 1న ముఖ్యమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన కింద పాపకు ఆపరేషన్ చేశారు.

ఆపరేషన్​ సమయంలో కడుపులో ఉన్నవి కణితలు కాదని, పిండాలు అని నిర్ధరణకాగా.. వారు షాక్​కు గురయ్యారు. అలా ఎనిమిది అభివృద్ధి చెందని పిండాలను తొలగించారు వైద్యులు. ప్రపంచవ్యాప్తంగా ఫీటస్-ఇన్-ఫీటూ కేసులు 100 కంటే తక్కువ ఉంటాయని వైద్యులు చెప్పారు. అయితే.. ఆయా కేసుల్లో కడుపు నుంచి ఒక పిండాన్ని మాత్రమే తొలగించారు. ఇలాంటి కేసు బహుశా ప్రపంచంలోనే మొదటిది అయ్యుండచ్చని పాపకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మద్యం మత్తులో గ్యాంగ్​ వార్.. తెగిపడిన చేతిని ఎత్తుకెళ్లిన వీధికుక్క

ఎర్రకోట ఉగ్రదాడి దోషికి ఉరే సరి... సుప్రీం కోర్టు ఫైనల్​ డెసిషన్​..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.