ETV Bharat / bharat

అరుణాచల్ ప్రదేశ్​లో భూకంపం.. అదృష్టవశాత్తూ...

author img

By

Published : Nov 10, 2022, 1:15 PM IST

Updated : Nov 10, 2022, 3:06 PM IST

Earthquake hit Arunachal Pradesh
అరుణాచల్ ప్రదేశ్​లో భూకంపం

అరుణాచల్ ప్రదేశ్​ పశ్చిమ సియాంగ్ జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైంది. అయితే ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని జిల్లా విపత్తు అధికారి తెలిపారు.

అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ సియాంగ్ జిల్లాలో గురువారం ఉదయం 10.31 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయని జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి తెలిపారు. అయితే ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదనిన జిల్లా విపత్తు నిర్వహణ అధికారి (డీడీయంఓ) నిమా దోర్జీ చెప్పారు.
మరోవైపు..నేపాల్​లోనూ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్​పై 4.1 తీవ్రత నమోదైంది. బుధవారం 6.6 రిక్టర్ స్కేలు రీడింగ్​తో భారీ భూకంపం సంభవించి, ఆరుగురు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మళ్లీ ఈ రోజు పశ్చిమ నేపాల్​లో భూమి కంపించింది.

ఇవీ చదవండి:క్రెడిట్‌ కార్డ్ క్యాన్సిల్‌ చేయాలా? ఈ తప్పులు చేయొద్దు!

బిజినెస్​లోనూ ధోనీ నెం.1.. బిగ్గెస్ట్​ ట్యాక్స్​ పేయర్​గా ఘనత!

Last Updated :Nov 10, 2022, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.