ETV Bharat / bharat

రెండు వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది దుర్మరణం

author img

By

Published : Jul 8, 2021, 9:48 AM IST

Updated : Jul 8, 2021, 11:24 AM IST

accident
నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లిన డంపర్​- ఐదుగురు దుర్మరణం

09:41 July 08

రెండు వేర్వేరు ప్రమాదాల్లో 10 మంది దుర్మరణం

dumper crushed
రాజస్థాన్​ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం

దేశంలోని రహదారులు రక్తమోడుతున్నాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 

రాజస్థాన్​ ఝాలావర్​ జిల్లా బడబేలా గ్రామం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఓ కుటుంబంపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ మహిళ, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం బుధవారం రాత్రి సుమారు 12 గంటలకు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు సురేశ్​, సీతాబాయి, నిర్మల్​, కమలేశ్, పవన్​లగా గుర్తించారు.

మహారాష్ట్రలో..

మహారాష్ట్రలోని నన్దర్బార్​ జిల్లాలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు తులాజ గ్రామానికి చెందగా, మరో ఇద్దరు తలోడా గ్రామస్థులుగా అధికారులు గుర్తించారు. 

Last Updated :Jul 8, 2021, 11:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.