ముంబయి క్రూజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీ కేసులో (Mumbai Rave Party news) మరో కోణం బయటపడింది. ఓ మహిళా నిందితురాలు.. శానిటరీ న్యాప్కిన్స్లో డ్రగ్స్ను పార్టీకి తీసుకెళ్లింది. ఆమె నుంచి ఐదు గ్రాముల ఎండీ పిల్స్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) (Drugs news) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ రేవ్పార్టీ (Mumbai Rave Party) కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు.
సముద్రం మధ్యలో పార్టీ
ఈ నెల 3న ముంబయి తీరంలో క్రూజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీపై (Mumbai Rave party news) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాడులు నిర్వహించింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎన్సీబీ అధికారులు.. తమని తాము ప్యాసింజర్లుగా పరిచయం చేసుకొని నౌకలోకి ప్రవేశించారు. ఈ నౌక గోవాకు వెళ్లినట్లు తెలిపారు. ముంబయి తీరం నుంచి నౌక బయల్దేరి సముద్రం మధ్యలోకి వెళ్లిన తర్వాత పార్టీ ప్రారంభమైందని చెప్పారు.
ఈ కేసులో (Mumbai Rave Party news) బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది.
ఇదీ చూడండి: 40 మంది ఉపాధ్యాయులకు ఎన్ఐఏ సమన్లు