ETV Bharat / bharat

నిలకడగా మన్మోహన్​ ఆరోగ్యం- ప్రముఖుల ఆరా

author img

By

Published : Apr 20, 2021, 4:26 PM IST

Updated : Apr 20, 2021, 4:44 PM IST

Dr Manmohan Singh
నిలకడగా మన్మోహన్​ ఆరోగ్యం- ప్రముఖుల ఆరా

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్​ సింగ్​ ఆరోగ్య పరిస్థితిపై దిల్లీ ఎయిమ్స్​ వైద్య బృందంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ ఆరా తీశారు. ఆయనకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు.. మన్మోహన్​ సింగ్ త్వరగా కోలుకోవాలని టిబెట్​ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆకాంక్షించారు.

మాజీ ప్రధాన మంత్రి డాక్టర్​ మన్మోహన్​ సింగ్​కు కరోనా నిర్ధరణ అయిన క్రమంలో ఆరోగ్య పరిస్థితిపై దిల్లీలోని ఎయిమ్స్​ వైద్య బృందంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ ఆరా తీశారు. ప్రస్తుతం మన్మోహన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.

"దిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందంతో మన్మోహన్​ సింగ్​ ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశాను. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉంది. ఉత్తమమైన చికిత్స ఆయనకు అందుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని మనమంతా ఆకాంక్షిద్దాం."

-హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.

మన్మోహన్​ సింగ్​ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆధ్యాత్మిక గురువు దలైలామా ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయనకు మంగళవారం ఓ లేఖ రాశారు.

"మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మీకు తెలిసినట్లుగా.. ఓ పాత స్నేహితుడిగా మీరంటే నాకు అపారమైన గౌరవం."

-దలైలామా, టిబెట్​ ఆధ్యాత్మిక గురువు

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి త్వరలోనే అంతమవుతుందని ఆకాంక్షిస్తున్నట్లు దలైలామా తన లేఖలో పేర్కొన్నారు.

మన్మోహన్​ సింగ్​కు సోమవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన దిల్లీలోని ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి: మన్మోహన్​ కోలుకోవాలని మోదీ, రాహుల్ ఆకాంక్ష

ఇదీ చూడండి: 'టీకాపై అనుమానాలు పెంచటంలోనే కాంగ్రెస్​ బిజీ'

Last Updated :Apr 20, 2021, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.