ETV Bharat / bharat

భారీ చోరీ..  224 తులాల బంగారం, రూ. 25లక్షలతో యజమాని కారులోనే..

author img

By

Published : Feb 15, 2022, 8:33 PM IST

Doctor House Robbery Tamilnadu: అర్ధరాత్రి ఓ వైద్యుడి ఇంట్లోకి చొరబడిన దొంగలు మొత్తం దోచుకెళ్లారు. 224 తులాల బంగారం, రూ. 25లక్షల నగదు, కారుతో ఉడాయించారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

వైద్యుడి ఇంట్లో భారీచోరీ
Robbers stole 280 Sovereign of gold

Doctor House Robbery Tamilnadu: తమిళనాడు దిండిగల్ జిల్లా ఓడ్డనచత్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఓ వైద్యుడి ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకెళ్లారు. ధర్మపురం రోడ్డు పరిధిలోని ఓడ్డనచత్రానికి చెందిన డాక్టర్. శక్తివేల్ స్థానికంగా పెద్ద డాక్టర్. ఆయన తన కుటుంబంతో 25ఏళ్లుగా నాగానంపట్టి బైపాస్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున డాక్టర్ ఇంట్లోకి చొరబడిన దుండగులు శక్తివేల్​తోపాటు కుటుంబసభ్యులను చంపేస్తామని బెదిరించారు. వారందరినీ ఇంట్లో ఓ చోట కట్టేశారు. ఇక ఇంట్లో ఉన్న 224 తులాల బంగారం, రూ. 25లక్షల నగదును తీసుకొని ఇంటిబయట పార్కింగ్​లో ఉన్న డాక్టర్​. శక్తివేల్ కారులోనే పరారయ్యారు.

ఈ ఘటనపై డాక్టర్​. శక్తివేల్ ఓడ్డనచత్రం పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసు బలగాలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చూడండి: 87ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. 16 గంటల్లోనే నిందితుడు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.