ETV Bharat / bharat

బిడ్డ పాలు తాగలేదని.. 'డాక్టర్' తల్లి ఆత్మహత్య!

author img

By

Published : Jan 11, 2022, 3:11 PM IST

Doctor commits suicide as her baby refusing to breastfeed in Mysore
బిడ్డపాలు తాగలేదని.. తల్లి ఆత్మహత్య!

Doctor Suicide News: పుట్టిన పిల్లలు ఏడాది కాలానికి పైగా అమ్మ చనుబాలు తాగుతారు. ఇలా తన 9 నెలల చిన్నారి పాలు తగడం లేదని ఓ డాక్టర్​ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటక మైసూర్​లోని గుండురావ్​ నగర్​లో జరిగింది.

Doctor Suicide News: 9 నెలల కూతురు తన రొమ్ముపాలు తాగడం లేదని మనస్తాపానికి గురైన ఓ డాక్టర్​ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటక మైసూర్​లోని గుండురావ్​ నగర్​లో జరిగినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన ఆమెను డా. అర్పితగా గుర్తించారు. అర్పిత భర్త కూడా వైద్యుడే అని పేర్కొన్నారు.

ఇదీ జరిగింది..

పోలీసుల కథనం ప్రకారం... అర్పితకు ఐదేళ్ల కిందట వివాహం అయ్యింది. పెళ్లి అయిన నాలుగేళ్ల తరువాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారికి 9 నెలలు ఉంటాయి. అయితే గత 15 రోజులుగా ఆ చిన్నారి అమ్మ చనుబాలు తాగడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన అర్పితా సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుంది.

అర్పిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యారణ్యపురం పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: మతిస్థిమితం సరిగాలేని బాలికపై గ్యాంగ్​ రేప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.