ETV Bharat / bharat

తమిళనాడులో మరో వారం పాటు లాక్​డౌన్​ పొడిగింపు

author img

By

Published : May 22, 2021, 4:46 PM IST

Updated : May 22, 2021, 5:54 PM IST

lockdown
లాక్​డౌన్​

తమిళనాడులో కరనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వైరస్​ కట్టడికి లాక్​డౌన్​ను మరోవారం పాటు పొడిగించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్​డౌన్​ను ఎలాంటి సడలింపులు లేకుండా మరో వారం పాటు పొడిగించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మే చివరి వరకు లాక్​డౌన్​ను పొడగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఆరోగ్య నిపుణులు, శాసనసభ నియమించిన కమిటీతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

దిల్లీలో ఇలా..

దిల్లీలో తాజాగా 2,260 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి మరో 182 మంది ప్రాణాలు విడిచారు. ఏప్రిల్​ 1నుంచి 3000 కేసుల కన్నా తక్కువగా కేసులు నమోదుకావడం ఇదే ప్రథమం. నగరంలో పాజిటివిటీ రేటు 3.58కు తగ్గిందని దిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి:గాలి ద్వారా బ్లాక్​ ఫంగస్ వ్యాప్తి- వాటిపైనా ప్రభావం!

:'దేశంలో తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు'

Last Updated :May 22, 2021, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.