ETV Bharat / bharat

Unlock: 'క్రమంగా లాక్​డౌన్​ ఎత్తివేత'

author img

By

Published : May 28, 2021, 3:09 PM IST

దేశ రాజధానిలో కరోనా ఉద్ధృతి అదుపులోకి వస్తున్న నేపథ్యంలో అన్​లాక్​ (unlock) ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. అయితే.. వైరస్​పై పోరాటం ముగియలేదని హెచ్చరించారు.

Aravind Kejriwal
అరవింద్​ కేజ్రీవాల్

కొవిడ్​ (Covid-19) రెండో దశ వ్యాప్తిని కట్టడి చేయటంలో పైచేయి సాధించినట్లు తెలిపారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ (Arvind Kejriwal). కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వైరస్​ నియంత్రణకు అమలులో ఉన్న లాక్​డౌన్(lockdown)​ను క్రమంగా ఎత్తవేసే ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు. అయితే.. వైరస్​పై పోరు ముగియలేదని స్పష్టం చేశారు.

"లాక్​డౌన్​ను క్రమంగా ఎత్తివేయాలని దిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీతో శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయించాం. ఈ ప్రక్రియలో కిందిస్థాయిలోని రోజువారీ కూలీలు, కార్మికులు, వలస కార్మికుల వంటి వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నాం. పరిశ్రమలను తెరవాలని, నిర్మాణ పనులకు అనుమతించాలని నిర్ణయించాం. నిపుణులు, ప్రజల అభిప్రాయాలతో ప్రతి వారం అన్​లాక్​ ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తుంది."

- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి

చాలా సమస్యలు ఎదుర్కొన్న తర్వాత కరోనా రెండో దశ ఉద్ధృతిని కట్టడి చేయగలిగామన్నారు కేజ్రీవాల్​. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. గురువారం పాజిటివిటీ రేటు 1.5 శాతం లోపే ఉందని తెలిపారు.

ఇదీ చూడండి: 2 DG drug: 2-డీజీ డ్రగ్​ ధర ఎంతంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.