ETV Bharat / bharat

దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కరోనా

author img

By

Published : Apr 17, 2021, 10:06 PM IST

Delhi High Court CJ DN Patel
దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీఎన్​ పటేల్​

దేశంలో కరోనా 2.0 కలకలం రేపుతోంది. కొవిడ్​ బారినపడిన ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. దిల్లీ హైకోర్టు న్యాయమూర్తికి శనివారం నిర్వహించిన పరీక్షల్లో వైరస్​ సోకినట్టు తేలింది.

దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీఎన్​ పటేల్​ కరోనా బారినపడ్డారు. ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని.. స్వీయ నిర్బంధంలోకి వెళ్లారని కోర్టు వర్గాలు శనివారం తెలిపాయి.

ఈ వారం ప్రారంభంలో.. దిల్లీ ఉన్నత న్యాయస్థానంలో మరో ముగ్గురు న్యాయమూర్తులకూ కరోనా సోకినట్టు తేలింది. తేలికపాటి వైరస్​ లక్షణాలు కలిగిన వారు.. స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

మార్చి 15 నుంచి.. దిల్లీ హైకోర్టులో భౌతిక విచారణ ప్రారంభమైంది. ఇటీవల కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఏప్రిల్​ 9 నుంచి 23 వరకు మళ్లీ వర్చువల్​ పద్ధతిలో విచారణ చేపట్టాలని నిర్ణయించారు.

ఇదీ చదవండి: మాజీ సీఎం కుమారస్వామి‌కి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.