ETV Bharat / bharat

'కేరళలో ఆత్మాహుతి దాడి చేస్తాం'.. ప్రధానికి బెదిరింపులు.. సెక్యూరిటీ వివరాలు లీక్

author img

By

Published : Apr 22, 2023, 12:38 PM IST

ప్రధాని నరేంద్ర మోదీపై దాడి చేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. మోదీ కేరళ పర్యటనకు వస్తే.. ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని అందులో ఉంది. దీనిపై పోలీసులు అప్రమత్తమయ్యారు. లేఖపై విచారణ జరుపుతున్నారు. ఏప్రిల్​ 24న కేరళలో రెండు రోజుల పాటు ప్రధాని పర్యటించనున్నారు.

death-threat-letter-to-pm-modi-in-kerala-visit-threat-letter-to-modi-assassination
కేరళ పర్యటనకు ప్రధాని మోదీకి బెదిరింపు లేఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కేరళ పర్యటనకు వస్తే ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని ఓ బెదిరింపు లేఖ విడుదలైంది. ఎర్నాకులం వాసి జోసెఫ్ జాన్ నడుముత్తమిల్ పేరుతో.. కేరళ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి ఈ లేఖ వచ్చింది. ఏప్రిల్​ 24న కేరళలో రెండు రోజుల ప్రధాని పర్యటన ఉన్న నేపథ్యంలో.. ఈ లేఖ బయటకు రావడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది.

లేఖపై రాష్ట్ర పోలీసులు, నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నాయి. వారం రోజుల క్రితం ఈ లేఖ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరిందని పోలీసులు తెలిపారు. అనంతరం ఆ లేఖను పోలీసు ముఖ్య అధికారికి.. బీజేపీ నాయకులు అందించారని వెల్లడించారు. కాగా శనివారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రధాని కేరళ పర్యటనలో భద్రతా ఉల్లంఘనలు..
మరోవైపు, కేరళలో ప్రధాని పర్యటనకు సంబంధించి భద్రతా ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన పర్యటన నేపథ్యంలో ఏడీజీపీ ఇంటెలిజెన్స్ రూపొందించిన వీవీఐపీల భద్రత వివరాలు.. రాష్ట్ర పోలీసుల నుంచి లీక్​ అయ్యాయి. సెక్యూరిటీ ఇంఛార్జ్​ అధికారుల వివరాలు సైతం బయటపడ్డాయి. కేవలం జిల్లా అధికారులకు మాత్రమే అందించిన.. 49 పేజీల సమగ్రమైన వివరాలు బహిర్గతమయ్యాయి. ఘటనపై ఏడీజీపీ ఇంటెలిజెన్స్ అధికారి టీకే వినోద్ కుమార్ విచారణకు ఆదేశించారు.

కేరళలో మోదీ పర్యటన..
ఏప్రిల్​ 24 నుంచి రెండు రోజుల పాటు కేరళలో ప్రధాన మంత్రి పర్యటిస్తారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఏప్రిల్​ 24న సాయంత్రం.. ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ విమానంలో మధ్యప్రదేశ్​ నుంచి కేరళకు ప్రధాని మోదీ బయలుదేరతారు. దాదాపు 5 గంటల ప్రాంతంలో కొచ్చి ఎయిర్​పోర్ట్​కు చేరుకుంటారు. అనంతరం అక్కడి రోడ్​ షోలో పాల్గొంటారు. ఆ తరువాత బీజేపీ నేతృత్వంలోని యువజన సంఘాలు నిర్వహించే 'యువం' అనే సమావేశంలో పాల్గొంటారు. తేవరా సేక్రెడ్ హార్ట్ కాలేజ్ గ్రౌండ్ ఈ కార్యక్రమం జరుగుతుంది.

కార్యక్రమం ముగిసిన తరువాత.. 7.45 గంటలకు తాజ్ మలబార్ హోటల్​కు చేరుకుని ఆ రాత్రికి మోదీ అక్కడే బస చేస్తారు. తరువాతి రోజు ఉదయం.. 9.25 గంటలకు కొచ్చి ఎయిర్​ పోర్ట్​ నుంచి రాజధాని తిరువనంతపురం బయల్దేరుతారు. దాదాపు 10.15 గంటలకు అక్కడికి చేరుకుంటారు. అనంతరం 10.30 గంటల సమయంలో సెంట్రల్ రైల్వే స్టేషన్​లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. సుమారు 20 నిమిషాల పాటు ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇది ముగిసిన అనంతరం 11 గంటలకు సెంట్రల్​ స్టేడియంలో జరిగే.. బహిరంగ సమావేశంలో మోదీ పాల్గొంటారు. సభ అనంతరం మధ్యాహ్నం 12.40 గంటలకు సూరత్‌కు బయలుదేరి వెళతారు.

మోదీ, యోగిని చంపుతామంటూ మెయిల్​..
రెండు వారాల క్రితం.. ఇదే తరహాలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ను​ చంపుతానంటూ ఓ అంగంతుకుడు బెదిరించాడు. గుర్తు తెలియని ఆ వ్యక్తి.. ఉత్తర్​ప్రదేశ్​ నోయిడాలో ఉన్న ఓ మీడియా సంస్థకు ఈ మెయిల్​ చేశాడు. దీంతో ఆ మీడియా సంస్థ అధికారులు వెంటనే పోలీసులుకు సమాచారం అందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడి క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.