ETV Bharat / bharat

ఇయర్​ఫోన్స్​ పేలి యువకుడు మృతి

author img

By

Published : Aug 6, 2021, 8:07 PM IST

bluetooth earphone death rajasthan, ఇయర్​ఫోన్స్​ పేలి మృతి
బ్లూటూత్​ ఇయర్​ఫోన్స్​ పేలి వ్యక్తి మృతి

ఇయర్స్​ఫోన్స్​కు యువత ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. వాటి​ని ఫోన్​కి కెనెక్ట్​ చేసుకుని తమకు నచ్చిన పాటలు, వీడియోలు చూసి ఆస్వాదిస్తారు. కానీ వాటి వల్లే ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

బ్లూటూత్​ ఇయర్​ఫోన్స్​ పేలిన కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజస్థాన్​లోని జైపుర్​ జిల్లా చౌమూలో శుక్రవారం జరిగింది. మృతుడు ఉదయ్​పుర గ్రామానికి చెందిన రాకేశ్​ నాగర్​గా పోలీసులు గుర్తించారు.

ఇయర్​ఫోన్స్​ను కనెక్ట్​ చేసుకుని రాకేశ్​ కాల్​ మాట్లాడుతున్న సమయంలో అవి పేలాయి. దీంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాకేశ్​ ప్రాణాలు కోల్పోయాడు.

bluetooth earphone death rajasthan, ఇయర్​ఫోన్స్​ పేలి మృతి
ఇయర్​ఫోన్స్​ పేలి మృతిచెందిన రాకేశ్​ నాగర్​

ఇయర్​ఫోన్స్​ పేలిన సమయంలో అతనికి గుండెపోటు వచ్చి ఉంటుందని.. ఆ కారణంగానే రాకేశ్​ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు భావిస్తున్నారు. దేశంలో ఈ తరహా ఘటన ఇదే తొలిసారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి : 30 ఏళ్లు శ్రమించి ఊరికి రోడ్డేసిన అన్నదమ్ములు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.