ETV Bharat / bharat

మరుగుదొడ్డిలో విగతజీవిగా గంధపు చెక్కల దొంగ!.. ఏం జరిగింది?

author img

By

Published : Oct 21, 2022, 12:57 PM IST

chikmagalur latest news
dead body found in toilet

అటవీశాఖ క్యాంప్​లోని మరుగుదొడ్డిలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవ్వడం కలకలం సృష్టించింది. అయితే పోలీసులే.. అతడ్ని చంపి ఇక్కడ పడేసి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కర్ణాటకలోని చిక్కమగళూరు​లో అధికారులు నిర్వహించిన ఏనుగులను చెదరగొట్టే క్యాంప్​ మరుగుదొడ్డిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. అయితే ఈ ఘటన వెనుక అటవీశాఖ అధికారుల హస్తం ఉందని స్థానికులు అనుమానిస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే..
చిక్కమగళూరు​​లో ఏనుగులను తరిమికొట్టే క్యాంప్​ను అటవీశాఖ అధికారులు నిర్వహించారు. అయితే గురువారం రాత్రి ఆ ప్రాంతానికి ఇద్దరు వ్యక్తులు గంధం చెక్కలు దొంగలించేందుకు వచ్చారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత రోజు క్యాంప్​లోని మరుగుదొడ్డిలో ఓ మృతదేహం దొరకడం స్థానికుల్లో తీవ్ర ఆందోళన రేపింది.

అయితే బాధితుడి మృతికి పోలీసులే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అతడిది లాకప్​డెత్​ అయి ఉంటుందని, పోలీసులే మరుగుదొడ్డిలో మృతదేహాన్ని పడేసి ఉంటారని స్థానికులు అంటున్నారు. అయితే పోలీసులు.. ఈ ఘటనతో తమకు సంబంధం లేనట్లుగా దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: సెప్టిక్​ ట్యాంక్​ క్లీన్​ చేస్తుండగా విషాదం.. ఊపిరి ఆడక ముగ్గురు కార్మికులు మృతి!

బెంగళూరు అతలాకుతలం.. చెరువులుగా మారిన రహదారులు.. అనేక ఇళ్లు ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.