దళిత మహిళపై లైంగిక వేధింపులు.. తుపాకీతో బెదిరించి..

author img

By

Published : Aug 1, 2022, 12:42 PM IST

sexually harassed

గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లిన ఓ దళిత మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఏడుగురు దుండగులు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

ఉత్తర్​ప్రదేశ్ ముజఫర్​నగర్​లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దళిత మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు ఏడుగురు వ్యక్తులు. ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులను కొత్వాలి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

అసలేం జరిగిందంటే: గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు నిందితులు. తుపాకీతో బెదిరించి మహిళను వివస్త్రను చేశారు. అనంతరం ఈ దుశ్చర్యను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. శనివారం సాయంత్రం కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుజ్, కుల్దీప్, అంకిత్ , రవి, రిజ్వాన్, చోటా, అబ్దుల్​ను నిందితులుగా పోలీసులు గుర్తించారు.

ఇవీ చదవండి: 'నాకింకా పెళ్లి కాలేదు.. అబ్బాయి ఉంటే చెప్పండి'.. పాటలు పాడుతూ ఎంపీ రిక్వెస్ట్

మాజీ ప్రధానిని స్క్రీన్​పై అలా చూసి.. ఏడ్చేసిన కుమారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.