ETV Bharat / bharat

ప్రేమను కాదన్న యువతి హత్య.. నీటిలో తోసి.. మళ్లీ వచ్చి కత్తితో పొడిచి..

author img

By

Published : Apr 9, 2022, 1:13 PM IST

lover-killed-the-girl
lover-killed-the-girl

Lover killed the girl: ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. ఓ యువకుడు ప్రేమ పేరుతో యువతిని బలితీసుకున్నాడు. కత్తితో పొడిచి చంపేశాడు. అంతకుముందు 112 నెంబర్​కు ఫోన్ చేసి.. పోలీసులను బెదిరించాడు. ఓ అమ్మాయి అంటే తనకు ఇష్టమని, ఆమె తనతో వివాహం చేసుకోకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. యువకుడిని అరెస్టు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.

Lover killed the girl: ప్రేమను నిరాకరించిందని ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తనను కాదన్న యువతిని హత్య చేశాడు. మృతురాలిని ఇంటర్ విద్యార్థిని శివానీగా గుర్తించారు. బరేలీలోని భమోరా ప్రాంతంలో ఉండేదని పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం ఓ నీటి కుంటలో ఆమె శవం కనిపించిందని చెప్పారు. శివానీ కాల్ రికార్డుల ప్రకారం ఆమెతో చివరగా మాట్లాడిన అజయ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడి ఫోన్ ఏప్రిల్ 4నే పోయిందని, కాల్ చేసింది ఇంకెవరోనని గుర్తించారు. అజయ్ ఫోన్​కు సంబంధించిన డేటాను వెలికితీశారు. ఆ అమ్మాయికి తాను ఫోన్ చేయలేదని, అదే గ్రామంలో ఉండే వికాస్(19) అనే వ్యక్తి చేశాడని చెప్పారు. దీంతో వికాస్​ను కస్టడీలోకి తీసుకున్నారు.

lover killed girl
నిందితుడు వికాస్

'ఓ అమ్మాయికి దగ్గర అవ్వాలని వికాస్ భావించాడు. అందుకే అజయ్ ఫోన్​ను దొంగలించి శివానీతో మాట్లాడాడు. శివానీకి స్నేహితుడైన రాహుల్​గా తనను తాను యువతితో పరిచయం చేసుకొని కాల్స్ చేసేవాడు. ఒకరోజు కలుద్దామని యువతి ఫోన్ చేసింది. మంగళవారం రాత్రి కలవడానికి వెళ్లిన వికాస్.. రాహుల్ కాసేపట్లో వస్తున్నాడని బుకాయించాడు. ఎంతసేపటికీ రాహుల్ రావడం లేదని భావించిన యువతి.. ఇంటికి వెళ్లిపోవాలని ప్రయత్నించింది. అదే సమయంలో వికాస్.. బాలికకు ప్రపోజ్ చేశాడు. చెయ్యి పట్టుకొని తన ప్రేమను వ్యక్తం చేశాడు. అతడి ప్రేమను బాలిక నిరాకరించింది. ఇంట్లో వాళ్లకు చెప్తానని బెదిరించింది. దీంతో కోపంతో ఆ అమ్మాయిపై దాడి చేశాడు. దుపట్టాను మెడకు చుట్టి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని దగ్గర్లోని నీటి కుంటలో పడేసి పారిపోయాడు. ఇంటికి వెళ్లిన తర్వాత మళ్లీ ఆలోచించాడు. ఒకవేళ బాలిక బతికే ఉంటే తనను పోలీసులు పట్టుకుంటారని భయపడి.. కత్తి తీసుకొని వెళ్లాడు. బాలిక గొంతు కోశాడు. కత్తితో శరీరంపై పొడిచాడు' అని ఎస్పీ రాజ్​కుమార్ అగర్వాల్ పేర్కొన్నారు. నిందితుడు వికాస్.. అజయ్ ఫోన్ నుంచి చాలా మంది యువతులకు కాల్స్ చేశాడని ఎస్పీ వెల్లడించారు.

అంతకుముందు పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు వికాస్. 112కు కాల్ చేసిన నిందితుడు తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. తనతో పెళ్లికి ఒప్పుకోకపోతే ఆమెను చంపుతానని పోలీసులతో అన్నాడు. అయితే, అతడు చెప్పింది ఈ బాలిక గురించి కాదని పోలీసులు తెలిపారు. ఆ తర్వాతి రోజు మరో అమ్మాయి వెంట పడ్డాడని వెల్లడించారు.

ఇదీ చదవండి: ఆశారాం బాపు ఆశ్రమం వద్ద బాలిక మృతదేహం.. కారులోనే కుళ్లిపోయి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.