ETV Bharat / bharat

రైలు పట్టాలకు పగుళ్లు.. ఎర్ర వస్త్రాన్ని చూపి వేల మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన రైతు

author img

By

Published : Aug 4, 2023, 5:15 PM IST

Rail Accident Missing : గోమతి ఎక్స్​ప్రెస్​కు భారీ ప్రమాదం తప్పింది. ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్ రాజ్- లఖ్​నవూ మార్గంలో పట్టాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. వాటిని గుర్తించిన స్థానిక రైతు.. పగుళ్ల వద్దకు రైలు చేరుకోక ముందే గోమతి ఎక్స్​ప్రెస్​ను ఆపాడు. ఎర్రని వస్త్రంతో లోకోపైలట్​కు సంకేతాలిచ్చాడు.

crack-on-railway-in-uttarpradesh-track-farmer-stopped-train-by-showing-red-garment-after-seeing-cracks-on-track
ఉత్తరప్రదేశ్‌లో రైల్వే ట్రాక్‌పై పగుళ్లు

Crack On Railway Track : ఓ రైతు వేల మంది రైలు ప్రయాణికుల ప్రాణాలను రక్షించాడు. రైల్వే ట్రాక్​పై పగుళ్లను గుర్తించి.. రైలు ప్రమాదం జరగకుండా నిలువరించాడు. రైలును ఆపాలని ఎర్రని ​వస్త్రాన్ని​ లోకో పైలట్​కు చూపుతూ.. భారీ ప్రమాదం నుంచి గట్టెక్కించాడు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగ్ రాజ్​ నుంచి లఖ్​నవూకు బయలుదేరిన గోమతి ఎక్స్​ప్రెస్​కు ఈ ప్రమాదం తప్పింది.

ప్రయాగ్​ రాజ్​ జిల్లాలోని భోలా కా పూర్వ గ్రామానికి చెందిన భన్వర్ సింగ్ అనే రైతు తన పొలం వైపు వెళుతుండగా.. లాల్​గోపాల్‌గంజ్ సమీపంలో రైల్వే ట్రాక్​పై పగుళ్లను గుర్తించాడు. అప్పుడే అటుగా వస్తున్న రైలును సైతం గమనించాడు. వెంటనే అప్రమత్తమై ఎర్రని వస్త్రాన్ని చూపుతూ.. రైలును ఆపాలని లోకోపైలట్​కు సంకేతాలిచ్చాడు. రైతు ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న లోకోపైలట్​.. రైలు వేగానికి బ్రేకులు వేసి నిదానంగా దాన్ని ఆపాడు.

Crack On Railway in uttarpradesh Track farmer stopped train by showing red garment after seeing cracks on track
పట్టాలకు పగుళ్లు
crack-on-railway-in-uttarpradesh-track-farmer-stopped-train-by-showing-red-garment-after-seeing-cracks-on-track
రైతు భన్వర్​ సింగ్​

అనంతరం పట్టాలపై పగుళ్లను లోకోపైలట్​కు చూపించాడు భన్వర్ సింగ్. ఘటనపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన లోకోపైలట్​.. రైతు భన్వర్ సింగ్​ను అభినందించాడు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడేసినందుకు రైతుకు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా పట్టాలపై పగుళ్ల కారణంగా ఆ మార్గంలో కాసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టాలకు మరమ్మతులు పూర్తయిన అనంతరం రైళ్ల రాకపోకలు సాఫీగా సాగాయి.

Crack On Railway in uttarpradesh Track farmer stopped train by showing red garment after seeing cracks on track
పట్టాలను పరిశీలిస్తున్న ప్రయాణికులు

తప్పిన భారీ ప్రమాదం.. రెండు భాగాలుగా విడిపోయిన ఎక్స్​ప్రెస్​ రైలు.. చివరకు..
నెల రోజుల క్రితం కూడా బిహార్​లోని కతిహార్ జిల్లాలో​ ఘోర రైలు ప్రమాదం తప్పింది. లోహిత్​ ఎక్స్​ప్రెస్ రైలు​ ఒక్కసారిగా రెండు భాగాలుగా విడిపోయింది. ఇంజిన్ నుంచి సుమారు 10 బోగీలు విడిపోయి పట్టాల మీద నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. బంగాల్​లోని నార్త్​ దినాజ్​పుర్​ జిల్లాలోని ఉన్న దల్ఖోలా స్టేషన్​ సమీపంలో ఈ ఘటన జరిగింది. కోచ్​ నుంచి బోగీలు విడిపోయాక.. అనేక మంది ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. అనంతరం విడిపోయిన బోగీలను మళ్లీ ఇంజిన్​కు జతచేసి.. రైలు ప్రారంభించారు అధికారులు. కాగా ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.