ETV Bharat / bharat

'వ్యాక్సినేషన్​లో ప్రపంచ రికార్డ్​.. టీకా పంపిణీ@2.5కోట్లు'

author img

By

Published : Sep 17, 2021, 1:55 PM IST

Updated : Sep 18, 2021, 12:39 AM IST

vaccination
టీకా

17:12 September 17

టీకా పంపిణీ@2.5కోట్లు..

టీకా పంపిణీలో శుక్రవారం భారత్​ చరిత్ర సృష్టించింది. ఒక్కరోజులో 2.5కోట్లకుపైగా వ్యాక్సిన్లు అందించింది. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా దూసుకెళుతోంది. మధ్యాహ్నం 1:30వరకు కోటి డోసులు అందివ్వగా.. 4 గంటల్లోనే మరో కోటి టీకాలు ఇవ్వడం విశేషం. రాత్రి 11:58 వరకు 2.5కోట్ల డోసులు దాటింది.

"ఒక్కరోజులో 2.5 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసి భారత్.. ప్రపంచ రికార్డు సృష్టించింది. ప్రధాని మోదీ 71వ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ ఘనత సాధించింది."

-- మన్​సుఖ్​ మాండవియా, కేంద్ర ఆరోగ్యమంత్రి.

సాయంత్రం 5:27 వరకు దేశవ్యాప్తంగా 2,03,68,343మంది టీకా తీసుకున్నారు. ఫలితంగా దేశంలో వ్యాక్సినేషన్​ 78.72కోట్లు దాటింది.

"ఆరోగ్య కార్యకర్తలు, ప్రజల తరఫున ప్రధాని మోదీకి ఇదొక కానుక. మోదీ పుట్టిన రోజు నాడు.. దేశం కీలక మైలురాయిని(ఒక్క రోజులో 2కోట్ల డోసుల పంపిణీ) అందుకుంది. ఇదొక రికార్డు. వెల్​డన్​ ఇండియా!"

  -- మన్​సుఖ్​ మాండవియా, కేంద్ర ఆరోగ్యమంత్రి.

అంతకుముందు.. సెప్టెంబర్​ 6, ఆగస్టు 31, ఆగస్టు 27న వ్యాక్సినేషన్​లో కోటి మార్కును అందుకుంది భారత్​.  

టీకా పంపిణీ ఇలా...

దేశవ్యాప్తంగా జనవరిలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలి 10కోట్ల డోసుల పంపిణీకి 85 రోజులు పట్టింది. అనంతరం 20కోట్ల మార్కుకు 45రోజులు, 30కోట్ల మార్కుకు 29రోజుల సమయం పట్టింది. ఆ తర్వాత వేగాన్ని మరింత పెంచిన ఇండియా.. కేవలం 24రోజుల్లోనే 40కోట్లు, 20రోజుల్లో 50కోట్ల మార్కును దాటేసి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 19రోజులకే 60కోట్లు, 13రోజులకే 70కోట్లు అందుకుంది.

శరవేగంగా టీకాలు అందిస్తున్న భారత్​కు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్​ను అనేకమార్లు అభినందించింది.

13:49 September 17

వ్యాక్సినేషన్​లో మళ్లీ రికార్డ్​.. మధ్యాహ్నం వరకే కోటి డోసుల పంపిణీ

టీకా పంపిణీలో భారత్​ దూసుకెళుతోంది(corona vaccination in india). శుక్రవారం ఒక్క రోజే.. మధ్యాహ్నం 1:30గంటల వరకు కోటికిపైగా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నెల రోజుల కన్నా తక్కువ వ్యవధిలో ఈ ఘనత సాధించడం ఇది నాలుగోసారి కావడం విశేషం.

ప్రధాని నరేంద్ర మోదీ(Modi Birthday) జన్మదినాన్ని పురస్కరించుకొని.. శుక్రవారం కోటిన్నర వ్యాక్సిన్​ డోసులను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది భాజపా. అందుకు అనుగుణంగా.. వ్యాక్సినేషన్​ ప్రక్రియ సాగుతోంది.

"ప్రధాని మోదీ పుట్టిన రోజున, మధ్యాహ్నం 1:30 వరకు, దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కోటి మార్కును దాటేసింది. అత్యంత వేగంగా కోటీ మార్కును అందుకోవడం ఇదే తొలిసారి. ఇదే వేగంతో ముందుకెళుతున్నాం. టీకా పంపిణీలో శుక్రవారం సరికొత్త రికార్డును సృష్టించి, ప్రధాని మోదీకి జన్మదిన కానుకగా ఇస్తామని మాకు నమ్మకం ఉంది."

 -- మన్​సుఖ్​ మాండవియా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి.

అంతకుముందు.. సెప్టెంబర్​ 6, ఆగస్టు 31, ఆగస్టు 27న వ్యాక్సినేషన్​లో కోటి మార్కును అందుకుంది భారత్​.  

టీకా పంపిణీ ఇలా...

దేశవ్యాప్తంగా జనవరిలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలి 10కోట్ల డోసుల పంపిణీకి 85 రోజులు పట్టింది. అనంతరం 20కోట్ల మార్కుకు 45రోజులు, 30కోట్ల మార్కుకు 29రోజుల సమయం పట్టింది. ఆ తర్వాత వేగాన్ని మరింత పెంచిన ఇండియా.. కేవలం 24రోజుల్లోనే 40కోట్లు, 20రోజుల్లో 50కోట్ల మార్కును దాటేసి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 19రోజులకే 60కోట్లు, 13రోజులకే 70కోట్లు అందుకుంది.

శుక్రవారం ఉదయం నాటికి దేశంలో 77.24కోట్ల టీకా డోసుల పంపిణీ చేశారు.

శరవేగంగా టీకాలు అందిస్తున్న భారత్​కు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్​ను అనేకమార్లు అభినందించింది.

ఇదీ చూడండి:- Modi birthday: 'మోదీ అంకితభావంతో.. అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారత్​'

Last Updated :Sep 18, 2021, 12:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.