ETV Bharat / bharat

Covid Vaccine: చనిపోయిన మహిళకు రెండో డోసు టీకా!

author img

By

Published : Jan 22, 2022, 10:48 AM IST

Covid Jab to Dead Woman: మూడు నెలల కిందట చనిపోయిన ఓ మహిళ.. తాజాగా కరోనా టీకా రెండో డోసు తీసుకుంది. అవును నిజం. ఆమెకు వ్యాక్సిన్​ ఇచ్చినట్లు సంబంధిత మొబైల్​ నంబర్​కు మెసేజ్​ రావడం ప్రస్తుతం వైరల్​గా మారింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని మహోబాలో జరిగింది. అసలేమైందంటే?

Covid jab message to dead woman
మరణించిన మహిళకు రెండో డోసు టీకా!

Covid jab message to dead woman: ఉత్తర్​ప్రదేశ్​లోని మహోబాలో మూడు నెలల కిందట చనిపోయిన మహిళకు.. తాజాగా కొవిడ్​ టీకా రెండో డోసు ఇచ్చినట్లు మెసేజ్​ రావడం వైద్య ఆరోగ్య శాఖలో కలకలం రేపుతుంది. ఈ ఘటనపై జిల్లా ప్రధాన వైద్యాధికారి డా. సుధాకర్​ పాండే విచారణకు ఆదేశించారు. ఇందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

ఇదీ జరిగింది?

హెల్త్​ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన డెత్​ సర్టిఫికెట్​ ప్రకారం హేమలత అనే మహిళ సెప్టెంబర్ 21న కొవిడ్​ కారణంగా మరణించింది. మూడు నెలలకు ఆమె కరోనా రెండో డోసు వ్యాక్సిన్​ తీసుకున్నట్లు మృతురాలి మేనల్లుడు సెల్​ఫోన్​కు మెసేజ్​ వచ్చింది. అది చూసి ఆశ్చర్యపోయాడు సౌరవ్​.

ఈ మెసేజ్​ రాకమునుపు సౌరవ్​ యాదవ్​కు టీకా పంపిణీకి సంబంధించి జనవరి 15న వెరిఫికేషన్​ కాల్​ కూడా వచ్చింది. ఆ సమయంలో అతను హేమలత చనిపోయినట్లు వారికి సమాచారం అందించాడు. అయినా.. టీకా తీసుకున్నట్లు మళ్లీ మెసేజ్​ రావడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: భయపెడుతున్న థర్డ్​ వేవ్​.. సుడిగాలిలా ఒమిక్రాన్‌ విజృంభణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.