ETV Bharat / bharat

దేశంలో మరో 2వేల కరోనా కేసులు- భారత్​పై​ సౌదీ ప్రయాణ ఆంక్షలు

author img

By

Published : May 23, 2022, 9:36 AM IST

Updated : May 23, 2022, 12:49 PM IST

INDIA COVID CASES
INDIA COVID CASES

Covid Cases In India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 2,022 కేసులు నమోదు కాగా, మహమ్మారి కారణంగా మరో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. కోలుకున్నవారి సంఖ్య 98.75 శాతానికి చేరింది.

INDIA COVID CASES: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా ఆదివారం 2,022 కేసులు నమోదయ్యాయి. మరో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 2,099 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోలుకున్నవారి శాతం 98.75గా ఉంది.

  • మొత్తం కరోనా కేసులు:43,107,573
  • మొత్తం మరణాలు: 5,24,459
  • యాక్టివ్​ కేసులు: 14,832
  • కోలుకున్నవారి సంఖ్య: 4,25,99,102

Vaccination India: దేశవ్యాప్తంగా ఆదివారం 8,81,668 మందికిపైగా టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,92,38,45,615కు చేరింది. ఒక్కరోజే 2,94,812 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

World Covid Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే మరో 4,76,103 మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. మరో 476 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 52,74,79,191కు చేరింది. మరణాల సంఖ్య 63,00,257కు చేరింది. ఒక్కరోజే 6,42,980 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 49,74,80,466గా ఉంది.

  • ఆస్ట్రేలియాలో తాజాగా 38,514 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జపాన్​లో తాజాగా 34,957 కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో 37 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికాలో కొత్తగా 19,979 కేసులు నమోదయ్యాయి. 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణ కొరియాలో 19,298 కేసులు వెలుగుచూశాయి. 54 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో కొత్తగా 17,744 కేసులు బయటపడ్డాయి. మహమ్మారితో 34 మంది ప్రాణాలు కోల్పోయారు.

కొరియాలో తగ్గని కొవిడ్ ఉద్ధృతి: ఉత్తర కొరియాలో కరోనా వైరస్ రోజురోజుకీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. తాజాగా మరో 1,67,650మంది కరోనా బారినపడగా.. ఒకరు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 68కు చేరుకుంది. ఉత్తర కొరియాలో ఇప్పటివరకు 28,14,380 మందికి కరొనా సోకగా..23,34,910మంది కోలుకున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు ఓ ఉన్నతాధికారి అంత్యక్రియలను బహిరంగంగానే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు కిమ్​ జోంగ్​ ఉన్​ సహా భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

భారత ప్రయాణికులపై ఆంక్షలు: కరోనా కట్టడిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా పదహారు దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. లెబనాన్​, సిరియా, టర్కీ, ఇరాన్​, అఫ్గానిస్థాన్​, ఎమెన్​, సోమాలియా, ఇథియోపియా, ఇండోనేషియాతో పాటు మరో ఆరు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించింది. మరోవైపు మంకీపాక్స్​ వైరస్​ కలవర పెడుతున్న సమయంలో.. పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని సౌదీ ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతానికి మంకీ పాక్స్ కేసు నమోదు కాలేదని పేర్కొంది.

ఇదీ చదవండి: దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు

Last Updated :May 23, 2022, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.