ETV Bharat / bharat

దేశంలో కొత్తగా 36,652 కరోనా కేసులు

author img

By

Published : Dec 5, 2020, 9:44 AM IST

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 36,652 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో 512 మంది ప్రాణాలు కోల్పోయారు.

corona virus cases
భారత్​లో కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కొవిడ్​-19 వైరస్​ కేసులు గురువారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 36,652 మంది కరోనా బారిన పడ్డారు. మరో 512 మంది మరణించారు. తాజాగా కరోనా నుంచి కోలుకుని 42,533 మంది ఇళ్లకు వెళ్లారు.

మొత్తం కేసుల సంఖ్య- 96,08,211

మరణాల సంఖ్య -1, 39,700

కోలుకున్నవారి సంఖ్య - 90,58,822

క్రియాశీల కేసులు- 4,09,689

డిసెంబర్​ 4 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 1,45,885,512 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క శుక్రవారం రోజే 11,57,763 కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది. రికవరీ రేటు 94.20 శాతానికి చేరగా మరణాల రేటు 1.45కు తగ్గినట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 4.35 శాతం యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.