ETV Bharat / bharat

Congress: ప్రధానితో భేటీకి కాంగ్రెస్​ సిద్ధం

author img

By

Published : Jun 23, 2021, 9:51 AM IST

జమ్ముకశ్మీర్​లోని వివిధ పార్టీలతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపే సమావేశానికి కాంగ్రెస్​ కూడా హాజరుకానుంది. పార్టీ నుంచి జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్​, తారా చంద్​, కాంగ్రెస్​ రాష్ట్ర కమిటీ చీఫ్​ గులాం అహ్మద్​ మిర్​ వెళ్లనున్నారు.

congress
కాంగ్రెస్

ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీతో జరగనున్న జమ్ముకశ్మీర్​లోని వివిధ పార్టీల సమావేశానికి కాంగ్రెస్​ కూడా హాజరుకానుంది. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం తెలిపింది. జమ్ముకశ్మీర్​కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని గతంలో చేసిన తీర్మానానికి తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది​.

సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్​ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రధాని మోదీతో కాంగ్రెస్​ తరపున జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్​, తారా చంద్​, కాంగ్రెస్​ రాష్ట్ర కమిటీ చీఫ్​ గులాం అహ్మద్​ మిర్​ హాజరుకానున్నారు. ప్రధాని మోదీ సమావేశం ఎజెండా ఇంకా వెల్లడించలేదని.. అందువల్ల దాని గురించి ఇప్పడు మాట్లాడటం సరికాదని మిర్​ అన్నారు.

ఇదీ చదవండి: 'ప్రధాని మోదీతో భేటీకి 'గుప్కార్'​ సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.