ETV Bharat / bharat

రైతులకు మద్దతుగా పార్లమెంట్​కు ట్రాక్టర్​పై వెళ్లిన రాహుల్

author img

By

Published : Jul 26, 2021, 11:10 AM IST

Updated : Jul 26, 2021, 12:33 PM IST

సాగు చట్టాలను నిరసిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్రాక్టర్​పై పార్లమెంట్​కు చేరుకున్నారు. పలువురు నేతలు సైతం రాహుల్ వెంట వచ్చారు.

Rahul Gandhi
రైతులకు మద్దతుగా పార్లమెంట్​కు ట్రాక్టర్​పై వెళ్లిన రాహుల్

రాహుల్

కేంద్ర ప్రభుత్వ సాగు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వినూత్నంగా నిరసన తెలిపారు. దిల్లీ సరిహద్దుతో పాటు జంతర్​మంతర్​ వద్ద రైతులు చేపట్టిన నిరసనకు మద్దతుగా ట్రాక్టర్​పై ప్రయాణించారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ.. పార్లమెంట్​కు వెళ్లారు రాహుల్.

Congress leader Rahul Gandhi drives a tractor to reach Parliament
పార్లమెంట్​కు ట్రాక్టర్​పై వచ్చిన రాహుల్ గాంధీ
Congress leader Rahul Gandhi drives a tractor to reach Parliament
పార్లమెంట్​కు ట్రాక్టర్​పై వచ్చిన రాహుల్ గాంధీ

"రైతుల సందేశాన్ని నేను పార్లమెంటు వరకు తీసుకొచ్చాను. కేంద్రం.. రైతుల గొంతుకను నొక్కేస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో రైతుల అంశాలపై చర్చించటం లేదు. సాగు చట్టాలను రద్దు చేయాలి. ఈ చట్టాలు కేవలం 2-3 వ్యాపారవేత్తలకే లాభం చేకూరుస్తాయని దేశ ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. రైతులు ఆనందంగా ఉన్నారని కేంద్రం భావిస్తోంది. పార్లమెంటు వెలుపల నిరసన తెలిపేవారు.. ఉగ్రవాదులని ముద్ర వేస్తోంది. రైతుల హక్కులను కేంద్రం హరిస్తోంది."

-- రాహుల్​గాంధీ, కాంగ్రెస్​ నేత

రాహుల్​తో పాటు పలువురు నాయకులు ఆయన వెంటే ట్రాక్టర్​పై ప్రయాణించారు. వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకమంటూ ఈ సందర్భంగా పలువురు బ్యానర్లు ప్రదర్శించారు.

Congress leader Rahul Gandhi drives a tractor to reach Parliament
పార్లమెంట్​కు ట్రాక్టర్​పై వచ్చిన రాహుల్ గాంధీ
Congress leader Rahul Gandhi drives a tractor to reach Parliament
పార్లమెంట్​కు ట్రాక్టర్​పై వచ్చిన రాహుల్ గాంధీ

చైనాను అలానే వదిలేస్తారా?

చైనాతో ఎలా వ్యవహరించాలో కేంద్రానికి అర్థంకావటం లేదని రాహుల్ విమర్శించారు. సరిహద్దులో చైనా కార్యకలాపాలను వదిలేస్తే భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు.

Rahul Gandhi
రాహుల్ ట్వీట్​

ఈ మేరకు.. తూర్పు లద్దాఖ్​లోని దెంచోక్​ ప్రాంతంలో చైనా సైన్యం మోహరించిందంటూ.. ఓ మీడియా సంస్థ ప్రచురించిన కథనాలపై రాహుల్ స్పందించారు. వాటిని తన ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్​ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా కూడా.. చైనా విషయంలో కేంద్రంపై విమర్శలు చేశారు. మన దేశ సరిహద్దు నుంచి చైనా సైన్యాన్ని తరిమేయాలని ట్వీట్​ చేశారు.

గతేడాది మే 5నుంచి ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. సరిహద్దులోని ఘర్షణ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ కోసం ఇప్పటికే 11 విడతల సైనిక చర్చలు జరిగాయి.

ఇవీ చదవండి:

'రైతులను కేంద్రం అవమానిస్తోంది'

'కేంద్ర సాగు చట్టాలు విలువ కోల్పోయాయి'

Last Updated :Jul 26, 2021, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.