కాంగ్రెస్​ నేత దారుణ హత్య.. పట్టపగలే పదునైన ఆయుధాలతో..

author img

By

Published : Jul 11, 2022, 8:13 PM IST

Congress Leader Brutally Killed in Kalaburagi

Congress Leader Killed: పట్టపగలే ఓ కాంగ్రెస్​ నేతను కత్తులతో నరికి చంపారు దుండగులు. కర్ణాటక కలబురగిలో ఈ ఘటన జరిగింది.

Congress Leader Killed: ఓ కాంగ్రెస్​ నేతను దారుణంగా హత్యచేశారు దుండగులు. కర్ణాటక కలబురగి మున్సిపల్​ కౌన్సిల్​ అధ్యక్షురాలి భర్త అయిన గిరీశ్​ కంబనూరును(42) పదునైన ఆయుధాలతో నరికి చంపారు. షాహబాద్ రైల్వేస్టేషన్​ వద్ద సోమవారం పట్టపగలే ఈ ఘటన జరిగింది. ​

Congress Leader Brutally Killed in Kalaburagi
కాంగ్రెస్​ నేత గిరీశ్​ కంబనూరు
గిరీశ్​ టికెట్​ రిజర్వేషన్​ కోసం వచ్చిన సమయంలో.. దుండగులు దాడి చేశారు. కత్తులతో పొడిచి, నరికి పారిపోయారు. కాంగ్రెస్​ నేత అక్కడికక్కడే చనిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి.. నిందితుల కోసం గాలిస్తున్నారు. రెండేళ్ల క్రితం గిరీశ్​ సోదరుడు సతీశ్​ కూడా దుండగుల చేతిలోనే హత్యకు గురయ్యారు.

ఇవీ చూడండి: సీనియర్లు, జూనియర్​ మధ్య వాగ్వాదం.. పదో తరగతి విద్యార్థి మృతి

విద్యాశాఖ మంత్రి ఉదారత.. చికిత్స కోసం చేతి బంగారు గాజులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.