బస్సు, లారీ ఢీ.. ఒక్కసారిగా మంటలు.. 12 మంది మృతి

author img

By

Published : Nov 10, 2021, 12:35 PM IST

Updated : Nov 10, 2021, 5:34 PM IST

rajasthan bus truck collision

12:30 November 10

ట్రక్కు, బస్సు ఢీ

ప్రమాద దృశ్యాలు

రాజస్థాన్ బాడ్​మేర్ జిల్లాలో ఘోర ప్రమాదం (Rajasthan accident) జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మరణించారు. 22 మందికి గాయాలయ్యాయి. బాడ్​మేర్-జోధ్​పుర్ జాతీయ రహదారి వద్ద ఉన్న బందియావాస్ గ్రామం సమీపంలో ఈ ఘటన(Rajasthan accident today) జరిగింది.

ప్రమాదం అనంతరం చెలరేగిన మంటల్లో బస్సు పూర్తిగా (Rajasthan accident news) కాలిపోయింది. ఘటన సమయంలో బస్సు నిండా జనం ఉన్నారని.. ప్రయాణికుల్లో ఒకరైన షారుక్ తెలిపారు. వెంటనే మంటలు వ్యాపించాయని చెప్పారు. కళ్ల ముందే కొందరు ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారని వివరించారు. దీంతో ప్రయాణికుల హాహాకారాలతో బస్సు మార్మోగిందని అన్నారు. 

వారి పరిస్థితి విషమం

మృతదేహాలు చాలావరకు కాలిపోయినందున.. మృతులను గుర్తించేందుకు డీఎన్​ఏ పరీక్షలు చేయిస్తున్నట్లు బాడ్మేర్ ఎస్​పీ దీపక్ భార్గవ్ వెల్లడించారు. క్షతగాత్రుల్లో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం జోధ్​పుర్​కు తరలించినట్లు వివరించారు.

పరిహారం ప్రకటించిన ప్రధాని

ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi news) విచారం వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు రూ.50 వేలు ప్రకటించారు. గాయపడ్డవారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

కలెక్టర్​కు సీఎం ఫోన్...

ఈ ఘటనపై స్పందించిన సీఎం అశోక్ గహ్లోత్.. వెంటనే సహాయక చర్యలకు ఆదేశించారు. బాడ్​మేర్ కలెక్టర్​తో ఫోన్​లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని సూచించారు.

Last Updated :Nov 10, 2021, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.