తదుపరి సీజేఐ ఎంపికపై కేంద్రం కసరత్తు.. జస్టిస్​ చంద్రచూడ్​కు అవకాశం

author img

By

Published : Oct 7, 2022, 11:00 AM IST

next cji

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​​ లలిత్​కు కేంద్ర ప్రభుత్వం ఓ లేఖ రాసింది. తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలో సూచించాలని కోరింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఉదయ్​ ఉమేష్​ లలిత్ నవంబర్​ 8న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. తదుపరి సీజేఐ ఎంపికకు కసరత్తు ప్రారంభించింది. 50వ సీజేఐగా ఎవరికి అవకాశం ఇవ్వాలో సూచించాలని కోరుతూ జస్టిస్​ లలిత్​కు లేఖ రాసింది. ఆనవాయితీ ప్రకారం సీజేఐ తన వారసునిగా అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును ప్రతిపాదిస్తారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్​ లలిత్​ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు. సాధారణంగా.. భారత ప్రధాన న్యాయమూర్తి సూచించే పేరును కేంద్ర ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉంటుంది.

జస్టిస్​ ఎన్​వీ రమణ భారత ప్రధాన న్యాయమూర్తి ఆగస్టు 26న పదవీ విరమణ చేశారు. ఆగస్టు 27న సీజేఐగా బాధ్యతలు చేపట్టారు జస్టిస్​ యూయూ లలిత్. ఆయన పదవీ కాలం దాదాపు 3 నెలలే. మరో నెల రోజుల్లో ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తదుపరి సీజేఐ నియామక ప్రక్రియ ప్రారంభించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.